Dr.Dasari Sudha MLA, Badvel.

  • Home
  • Dr.Dasari Sudha MLA, Badvel.

Dr.Dasari Sudha MLA, Badvel. YSRCP, BADVEL CONSTITUENCY M.L.A.,

"బద్వేలులో వైయస్సార్ విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం" పార్టీ ఆవిర్భవించి 16 సంవత్సరాలు పూ...
12/03/2026

"బద్వేలులో వైయస్సార్ విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం"

పార్టీ ఆవిర్భవించి 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి గజమాల వేసి భారీ కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, పార్టీ నాయకులు కార్యకర్తలు...

12/03/2026

ధైర్యానికి చిరునామా.. భరోసాకు కేరాఫ్ అడ్రస్.. మన వైయస్‌ఆర్‌సీపీ జెండా! వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంద‌ర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు.

ఈ రోజు "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" పురస్కరించుకొని కడప వై.యస్.ఆర్.సి పార్టీ ఆఫీసు నందు జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు...
08/03/2026

ఈ రోజు "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" పురస్కరించుకొని కడప వై.యస్.ఆర్.సి పార్టీ ఆఫీసు నందు జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి "తెలుగు పల్లె సుబ్బమ్మ" మరియు టౌన్ ప్రెసిడెంట్ శ్రీమతి "దీప్తి" ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం వేడుకలు గణంగా నిర్వహించారు

ఈ వేడుకలకు గౌరవ బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు ముఖ్య అతిథిగా హాజరైనారు

ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి తదనంతరం కేక్ కట్ చేయడం జరిగింది

ఈ కార్యక్రమం లో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా,ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రా రెడ్డి,మేయర్ పాకా సురేష్,డిప్యూటీ మేయర్ శ్రీ నిత్యానంద రెడ్డి,జిల్లా యస్.సి సెల్ అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర్లు, నాయకురాలు పాల్గొన్నారు.

08/03/2026

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ రోజు బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ రాజ గోపాల్ రెడ్డి గారు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మైదుకూర...
07/03/2026

ఈ రోజు బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ రాజ గోపాల్ రెడ్డి గారు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మైదుకూరు నియోజకవర్గం పరిశీలకుడిగా నియమితులైన సందర్భంగా గౌరవ బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారి ని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవుతో సన్మానించడం జరిగింది

అనంతరం ఎమ్మెల్యే గారు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారిని కూడా సన్మానించి పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేయాలని మళ్ళీ మనం అందరం కలిసి మన నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేయాలని సూచించారు

ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ శ్రీరాములు,MRF రమణా రెడ్డి,జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్న కృష్ణా రెడ్డి, శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ రమణయ్య,వెంకట సుబ్బయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

20/02/2026

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరుతూ మార్చి 1 జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

ఈ రోజు కడప పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యం లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో రాయలసీమ ను సస్యశ్యామలం చేయాలని ఉద్దేశం తో శ్రీశైలం నుండి 800 అడుగులు ఎత్తు లో నీటిని తరలించాలని ఉద్దేశం తో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి సుమారు 90 శాతం పనులు కూడా పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు.కానీ తెలంగాణా నిండు శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయడం జరిగింది అని మాట్లాడినా ఇంకా తెలుగు దేశం నాయకులు బుకాయించడం సరి కాదన్నారు

చంద్ర బాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచినా ఒక్క మాట కూడా ఆనాడు మాట్లాడలేదన్నారు.రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ కు ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడు నిర్వహణాన్ని మా పార్టీ తరుపున ఎండ కడతామన్నారు

కావున మా పార్టీ తరుపున అన్ని పార్టీ లు ను,ప్రజాసంఘాలు ను కలుపుకొని చంద్ర బాబు నాయుడు తీరుకు నిరసనగా మార్చి 1 వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాయలసీమ ప్రాంత ప్రజల తరుపున పోరాడుతాం అని తెలియచేశారు

*బద్వేలు మండలం గుంతపల్లె గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 958/2లో పేదలకు కేటాయించిన స్థలాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు,...
15/02/2026

*బద్వేలు మండలం గుంతపల్లె గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 958/2లో పేదలకు కేటాయించిన స్థలాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు పరిశీలించారు. కట్టడాలు కూల్చివేయడంతో తమ స్థలాల వద్దే నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులను వారు పరామర్శించి, స్థలాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలు ఉండి ఏళ్ల తరబడి తమ స్వాధీనంలో ఉన్న పేదల స్థలాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొందరు టీడీపీ నాయకుల మాటలు విని స్వాధీనం చేసుకోవాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. 1996 నుంచి వివిధ దశల్లో పట్టాలు పొందిన పేదల స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించి స్థలాలను చదును చేయడం అన్యాయమని, సుమారు 20 ఏళ్లుగా పేదల స్వాధీన అనుభవంలో ఉన్న స్థలాల్లో అకస్మాత్తుగా తాత్కాలిక నిర్మాణాలను తొలగించడం సరికాదని పేర్కొన్నారు. కొందరు టీడీపీ నాయకులు బినామీ పట్టాల పేరుతో ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలనే ఎత్తుగడలో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని, రాజకీయాలకు అతీతంగా పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఎన్టీఆర్ కాలనీ ఏర్పాటుకు తమకు వ్యతిరేకత లేదని, అయితే పట్టణంలో అనేక అనువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ పట్టాలు ఉన్న పేదల స్థలాల జోలికి రావడం సరికాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను క్షుణ్ణంగా వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుత్తా శ్రీరాములు, రైతు విభాగం జిల్లా కార్యదర్శి చెన్నకృష్ణారెడ్డి, కౌన్సిలర్ రామ్మోహన్, వార్డు ఇన్‌చార్జిలు ఎంఆర్‌ఎఫ్ రమణారెడ్డి, సుబ్బరాజు, కృష్ణారెడ్డి, రామ్మోహన్, రామచంద్రనాయుడు, రోసిరెడ్డి, చెన్నయ్య, ఓబులేసు, గంగాదేవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.*

10/02/2026

శ్రీశైలంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై భగ్గుమన్న శివస్వాములు!

ఉదయం నుంచి దర్శనం కోసం చంటి పిల్లలు, వృద్ధుల హాహాకారాలు. రోడ్డుపైనే క్యూ లైన్లలో పడిగాపులు. అస్వస్థతకు గురైన భక్తులకు కనీస వైద్యం అందని దైన్యం

శ్రీశైలం క్షేత్రంలో కట్టలు తెంచుకున్న ఆగ్రహజ్వాలలు. ఆలయంలోనే బైఠాయించి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ శివస్వాములు నినాదాలు. స్వాములపై లాఠీ ఎత్తిన పోలీసులు.

ఇదేనా Nara Chandrababu Naidu భక్తులకు మీరు ఇచ్చే గౌరవం?



గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన గౌరవ బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు  ఈ రోజు కడప కలెక్టరేట్ ...
07/02/2026

గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన గౌరవ బద్వేల్ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

ఈ రోజు కడప కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిధి మీనా IAS గారిని కలిసి బద్వేల్ నియోజకవర్గ సమస్యలు గురించి చర్చించడం జరిగింది

ఈ కార్యక్రమంలో అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి,రంగసముద్రం సర్పంచ్ శ్రీ రవి ప్రకాశ్ రెడ్డి,పోరుమామిళ్ళ జడ్.పి.టి.సి శ్రీ ముత్యాల ప్రసాద్,డి.యల్.డి.ఏ ఛైర్మన్ శ్రీ మాధవ రెడ్డి,మాజీ డైరెక్టర్ శ్రీ వెంకట సుబ్బారెడ్డి ఇతరులు పాల్గొన్నారు

తేది: 03-02-2026"రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అని కోరుతూ 5 వ తేదీ మహా ధర్నా" రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్...
04/02/2026

తేది: 03-02-2026
"రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అని కోరుతూ 5 వ తేదీ మహా ధర్నా"

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరుతూ 5 వ తేదీ న పోతిరెడ్డిపాడు దగ్గర జరిగే మహాధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయం లో పోస్టర్ ను ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న బద్వేల్ శాసన సభ్యురాలు శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ

శ్రీశైలం లో 800 అడుగుల నుండి నీళ్ళు వాడుకుంటేనే రాయలసీమ ప్రాంతం బాగుపడుతుంది అని భావించి మా నాయకుడు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించి సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది.కానీ తెలంగాణ నిండు శాసన సభలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా విజ్ఞప్తి మేరకే చంద్ర బాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు అని చెప్పడం జరిగింది.

దీన్ని నిరసిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ఈ నెల 5 వ తేదీన పోతిరెడ్డి పాడు దగ్గర పెద్ద ఎత్తున మహా ధర్నా చేయాలని నిర్ణయించడమైనిది.కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వై.యస్.ఆర్.సి పి అభిమానులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

ఈ కార్యక్రమం లో జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే శ్రీ అమర్నాథ్ రెడ్డి,ఎమ్మెల్సీలు శ్రీ రామసుబ్బా రెడ్డి, శ్రీ రామచంద్రా రెడ్డి,పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి, శ్రీ శ్రీకాంత్ రెడ్డి, శ్రీ కడప మేయర్ శ్రీ సురేష్,మాజీ ఎమ్మెల్యే శ్రీ రఘు రామ్ రెడ్డి,డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, శ్రీ రెడ్యం వెంకట సుబ్బా రెడ్డి, శ్రీ గురు మోహన్ ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు

ఇప్పటికైనా చంద్రబాబు గారు యావత్తు ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు    తి...
31/01/2026

ఇప్పటికైనా చంద్రబాబు గారు యావత్తు ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిసింది అని శ్రీ చంద్ర బాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని లడ్డు లో ఎటువంటి జంతువులు కొవ్వు కలవలేదు అని సి.బి.ఐ కోర్టు కు సమర్పించిన చార్జిషీట్ లో పేర్కొనడటం జరిగింది అని తెలిపారు

ఈ సందర్బంగా బద్వేల్ నియోజకవర్గం లో వై.యస్.ఆర్.సి పార్టీ తరుపున సిద్ధవటం రోడ్ లోని ఫైర్ ఆఫీస్ వెనకాల గల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి,101 టెంకాయ లు కొట్టి ఆ స్వామి వారిని ప్రార్ధించడం జరిగింది

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

తిరుమల లడ్డు లో జంతువుల కొవ్వు కలిసింది అని ఏదైతే ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు గారు చెప్తున్న మాటలు పూర్తిగా అవాస్తవమని తేట తెల్లమైంది అని తెలిపారు

ఈ ప్రపంచం లో కోట్ల మంది భక్తులు కలిగిన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు పైన పూర్తిగా అవాస్తవాలు మాట్లాడి భక్తులను గందర గోళం కు గురి చట్టం జరిగింది అని తెలిపారు

ఆయన వ్యాఖ్యలు తో ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినడం జరిగింది అని తెలిపారు

తిరుమల లడ్డు పైన కూడా నీచ రాజకీయాలు చేసి దాని ద్వారా కూడా రాజకీయం లబ్ధి పొందాలని చంద్ర బాబు నాయుడు కుట్రలకు తెరపేపారన్నారు

లడ్డు పేరు తో పూర్తిగా నిరాదరమమైన ఆరోపణలు చేసి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ఠ ను దెబ్బ తీయాలని చంద్రబాబు గారు చేసిన కుట్రలను పూర్తిగా ప్రజా క్షేత్రంలో ప్రజలకు వివరి స్తామన్నారు

కావున ఇప్పటికైనా చంద్రబాబుగారు తను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వెనక్కు తీసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగంగా క్షమాపణ తెలియచేయాలి అని తెలిపారు

ఈ కార్యక్రమ లో ముఖ్య మైన వై.యస్.ఆర్.సి నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,యం.పి.పి లు,వార్డు మెంబెర్స్,కౌన్సిలర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు

పోరుమామిళ్ళ ఆసుపత్రి అభివృద్ధి సమావేశం లో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు ఈ రోజు పోరుమామిళ్ళ ప్ర...
30/01/2026

పోరుమామిళ్ళ ఆసుపత్రి అభివృద్ధి సమావేశం లో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

ఈ రోజు పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగిన అభివృద్ధి సమావేశం లో పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు

ఆసుపత్రి నందు అందుతున్న సేవలపై చర్చించి ఆసుపత్రి కి వచ్చే రోజులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు

ఆసుపత్రి నందు గల మౌలిక సదుపాయాలు గురించి చర్చించడం జరిగింది

ఆసుపత్రి ఆవరణ లో తిరిగి అక్కడికి వచ్చే రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను గురించి ఆరా తీయడం జరిగింది

అనంతరం పలు రికార్డ్స్ ను పరిశీలించడం జరిగింది

ఈ కార్యక్రమం లో యం.పి.పి శ్రీ బాషా, జడ్.పి.టి.సి శ్రీ ప్రసాద్,రంగ సముద్రం సర్పంచ్ శ్రీ రవి ప్రకాశ్ రెడ్డి, వైస్ యం.పి.పి రాజశేఖర్, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి,శివ, సూపరింటెండెంట్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Dasari Sudha MLA, Badvel. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram