27/04/2026
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పై ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవటం పై వైయస్ఆర్ సీపీ నేతల ఆగ్రహం..
వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చిన వైయస్సార్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి అంజాద్ భాషా, CEC సభ్యులు కే.సురేష్ బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, మరియు వైయస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు..
ఏబీఎన్ రాధాకృష్ణ వైయస్ఆర్ సీపీ నేతల భార్యలపై అగౌరవంగా మాట్లాడి కించపరిచాడు, ఏబీఎన్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా పట్టించుకోవటం లేదు, ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వైయస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీస్ వ్యవస్థ బండారం బయటపడింది. పబ్లిక్ గా వైయస్ఆర్ సీపీ నేతల భార్యలపై మాట్లాడిన ఏబీఎన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? తాము ఫిర్యాదు చేస్తుంటే ఆ లెటర్ తీసుకోవటానికి కూడా భయపడుతున్నారు, టీడీపీ నేతలకి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? నిజంగా మహిళలు అంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.