02/05/2026
తలసేమియా రన్ లో పాల్గొందాం..బాధిత చిన్నారులకు మన వంతుగా మద్దతును తెలియజేద్దాం.!!
సమాజంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో తలసేమియా ఒక ముఖ్యమైన వంశపారంపర్య రక్త వ్యాధి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో హీమోగ్లోబిన్ సరైన విధంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల రోగులు తీవ్రమైన రక్తహీనతకు గురవుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలలో అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లల్లో ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. సరైన చికిత్సగా రక్త మార్పిడి, ఐరన్ నియంత్రణకు మందులు, వీరిని ఆదుకోవడానికి స్పందించే హృదయంతో హైదరాబాద్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది. రక్త దాతల సహకారంతో పాటు ఉచిత రక్త మార్పిడిని కూడా అందిస్తోంది.
ఈ సేవా కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జలవిహార్ నెక్లెస్ రోడ్ వద్ద ది.10, 2026 ఆదివారం ఉదయం 5:00 గంటలకు 3K | 5K | 10K తలసేమియా రన్ నిర్వహించబడుతోంది..ఈ కార్యక్రమంలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 10,000 పైగా అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించి, అర్జున, ఖేల్ రత్న వంటి పురస్కారాలు పొందిన క్రికెట్ దిగ్గజం, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా రన్ బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్ గారు కూడా పాల్గొననున్నారు..
ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో మనం కూడా పాల్గొని,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మన మద్దతును తెలియజేద్దాం.
మీ రిజిస్ట్రేషన్ కోసం www.thalassemiarun.org లేదా BookMyShow లో ఇప్పుడే బుక్ చేయండి
మరన్ని వివరాలకు 9100366695 ఫోన్ నెంబర్ కు సంప్రదించండి
తలసేమియా చిన్నారుల కోసం కలిసి నడుద్దాం..వారి బంగారు భవిష్యత్తుకు భరోసానిద్దాం.