08/10/2025
ఫీజుల వేధింపులకు పాల్పడుతున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి - SFI
ఫీజుల వేధింపులకు పాల్పడుతున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అనంతపురం నగర శివార్లలోని వడియం పేట గర్ల్స్ క్యాంపస్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్, జిల్లా అధ్యక్షులు తరిమెల గిరి మాట్లాడుతూ! విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా గడవకముందే దాదాపు 80 శాతం ఫీజు కడితేనే అనుమతిస్తామని నారాయణ విద్యా సంస్థలు తల్లిదండ్రులకు ఫీజుల వేధింపులకు పాల్పడుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దాదాపు 80 శాతం అంటే 90 వేల నుంచి లక్ష రూపాయల వరకు మూడు నెలలు గడవకముందే చెల్లించాలని హుకుం జారీ చేయడానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. దేశంలోనే కరువుకు నిలయమైనటువంటి అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు పస్తులుండి తిని తినక విద్యార్థులను చదివించడానికి విద్యాసంస్థల్లో చేరిస్తే వారు ఫీజుల దోపిడీకి పాల్పడుతూ తప్పనిసరిగా 80% ఫీజు 80 వేల నుండి లక్ష రూపాయలు వరకు మూడు నెలలకే చెల్లించాలి అనడం సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు లేనందున ప్రధాన పంట అయిన వేరుశనగ, వరి లాంటి పంటలు ఈ సంవత్సరం వేయలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారని అటువంటి పరిస్థితుల్లో తల్లి పుస్తెలమ్మి, తాకట్టు పెట్టి విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విద్యా సంవత్సరం దాదాపు పది నెలల గడుస్తుంది ప్రస్తుతం మూడు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఐదు నుంచి ఆరు నెలలు విద్యా సంవత్సరం పూర్తవ్వాల్సి ఉంది కానీ నారాయణ విద్యాసంస్థల్లో మాత్రం 80% ఫీజులు కడితేనే రికార్డులు ఇస్తామని, మరియు పరీక్ష ఫీజులు కట్టించుకుంటూమని చెప్పడం వారి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు విషపు కోరలు చేస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాలోని నారాయణ విద్యాసంస్థల్లో దసరా సెలవులు ముగించుకొని వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా ఫీజులు చెల్లించాల్సిందేనని లేనిపక్షంలో విద్యార్థులను మానసికంగా వేధిస్తూ వికృత కార్యానికి దిగజారుతున్నారన్నారు. ప్రస్తుతం గర్ల్స్ క్యాంపస్లో డబ్బు కడితేనే లోపలికి పంపుతామని లేని పక్షంలో తిరిగి వెళ్ళిపోవచ్చు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారు. ఇంకా మొదటి సంవత్సరం పూర్తి చదవని విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఉంటుందని దాని అనంతరం సర్టిఫికెట్లు ఇచ్చే లోపు పూర్తిగా చెల్లించే విసులుబాటును కల్పించాలన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్ఐఓ గారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తక్షణమే RIO గారు నారాయణ కళాశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో నారాయణ విద్యాసంస్థల మీద నిరంతరం కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు భీమేష్, నగర్ కమిటీ సభ్యులు సాయి కృష్ణ, శేషు, జయ, పరమేష్, శశి, ఓము, శిక్షావలి, అశోక్, తదితరులు పాల్గొన్నారు