30/04/2026
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణం, అమలాపురంలో భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడినవి.
ఈ పవిత్ర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. స్వామి వారి దివ్య సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు.
22-04-2026 బుధవారం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము భక్తి వైభవంగా, మంగళ వాయిద్యాల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. ఈ దివ్య కళ్యాణోత్సవాన్ని వీక్షించిన భక్తులు స్వామి వారి కృపా కటాక్షములు పొందారు.
మహోత్సవముల సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా భక్తులకు సక్రమంగా నిర్వహించబడింది.
ఈ దివ్య బ్రహ్మోత్సవములు శ్రీ కలిదిండి వీరవెంకట సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) గారు, శ్రీమతి బదరీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినవి.
అలాగే శ్రీ కలిదిండి రవి వర్మ గారు, శ్రీమతి శేషపవిత్ర గారు, శ్రీ కలిదిండి శశి వర్మ గారు, శ్రీమతి వెంకట లక్ష్మి గార్ల పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించబడినవి.
ఈ దివ్య బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన భక్తులు, నిర్వాహకులు, సేవకులు మరియు ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.