Gokul Ayurvedic Hospitals

Gokul Ayurvedic Hospitals Gokul Ayurvedic Hospitals committed to provide super specialty Ayurvedic treatment. Gokul Ayurvedic Hospitals started business with two partners Smt V.

Amrutha Lakshmi, Managing Partner and V. Subbalakshamma. We maintain Ayurvedic hospitals by employing qualified ayurvedic doctors and staff. In July 1999 Gokul started out patient service at Anantapur with minimum facilities and gradually developed as Super specialty Ayurvedic Hospital in Own Building. Gokul Ayurvedic Hospitals provides a wide range of Ayurvedic treatments for all chronic diseases, life style modification programmes, body cleansing, rejuvenative Rasayana Therapy and typical ayurvedic treatments including:

Pulse diagnosis & Consultation
Panchakarma detoxification and body cleaning
Weight management programme
Swarna Prashana
Diabetic management
hypertention management
Leech Therapy
Seasonal panchakarma therapies for prevention of diseases
pumsamana
Uttaravasthi for infertility

We provide Superspeciality Ayurvedic treatments such as Panchakarma, Ksharasutra, Therapy etc. We encourage the younger generation to study and practice Ayurveda, to create awareness in the public to use the Ayurvedic System to prevent and cure diseases. The Doctors working for our hospital are well qualified, efficient and well experienced in their specialties and the staff working for our hospital are experienced, service-motivated, and kind-hearted. Gokul Ayurvedic Hospitals offers air-conditioned consultation rooms, waiting hall, panchakarma theatres, minor operation theatre for Ksharasutra therapy, special rooms, common rooms for in patients, with attached toilets, 24-hour water supply, Ayurvedic medical shop with more than 750 varieties of medicines available. Gokul believes Ayurveda is living progressive system; Gokul is using information technology for well being of our patients and proving online advice to the patients. Gokul providing detailed information to the patients regarding their diet habits medications, exercises etc. Gokul Ayurvedic Hospitals believes "service to the patients is service to the God". We are providing GOKUL HEALTH CARD to the patients who are poor and needy. They are eligible for "Free doctor consultation, and discount in panchakarma therapies and medicines". The Secret of Success of our Hospital is that "Management and Employees are Functioning as single Family” keeping in view that Ultimate aim is the welfare of Humanity. "Lokassamstha Sukhino bhavantu"
"Shreo bhuyat Sakala Janaanam (May all be happy & Prosperous)".

Big thanks to Dr. Malleswaramma Rmvfor all your support! Congrats for being top fans on a streak 🔥!
02/01/2026

Big thanks to Dr. Malleswaramma Rmv

for all your support! Congrats for being top fans on a streak 🔥!

Big thanks to Malleswaramma Rmvfor all your support! Congrats for being top fans on a streak 🔥!
02/01/2026

Big thanks to Malleswaramma Rmv

for all your support! Congrats for being top fans on a streak 🔥!

Next Pushyami Nakshatra Day: 05-01-2026 Monday .The best day for SWARNA MEDHA administration — a premium Swarna Prashana...
02/01/2026

Next Pushyami Nakshatra Day: 05-01-2026 Monday .

The best day for SWARNA MEDHA administration — a premium Swarna Prashana for immunity and memory enhancement.

Use only as directed by an Ayurveda physician.

For enquiries:
📞 98854 12444
📱 WhatsApp: 98854 12444

Gokul Ayurveda
🌐 https://www.gokulayurveda.co.in/product/Swarna-Medha-2ml-9ldEE

31/12/2025
ఉప్పు తెచ్చే ముప్పు.ఆయుర్వేదం.ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిష...
28/12/2025

ఉప్పు తెచ్చే ముప్పు.
ఆయుర్వేదం.
ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్‌ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1; ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహారసేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది.

చరక సంహిత విమానస్థానంలో: ‘‘అథ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం... పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 15 – 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది.

పరిమిత పరిమాణంలో... వాగ్భట సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృత్‌ స్వేహనః స్వేదనః తీక్ష›్ణ రోచనః ఛేద భేద కృత్‌ ‘‘ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది.

అతిగా సేవిస్తే అనర్థాలు
రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి.

"సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం వలిమ్‌ తృట్‌ కుష్ఠ విషవిసర్పాన్‌ జనయేత్‌ క్షపయేత్‌ బలమ్‌"

శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్‌ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్‌.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్‌ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్‌ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్‌ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్‌ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఐదు రకాల లవణాలు
సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్‌ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం NACL , సైంధవ లవణం (Rock salt: 70% NACL ) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% NACL) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% NACL)

తప్పించుకోవడం ఎలా?
నిషిద్ధం: ఊరగాయలు, నిల్వపచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్‌ ఫ్రైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్‌ ఫుడ్స్‌ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి.

సేవించవలసినవి
ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, బీట్‌రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్‌సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొదౖలñ నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్‌ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే... గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి.

గమనిక
రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను ‘రుచి రోగాలు’ అంటారు. ఇవి కూడా ‘సుఖరోగాల’ వలే అనర్థదాయకం. ఆరోగ్యప్రదమైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు.
Credit: సాక్షి 28-12-2019

సేకరణ.
గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్
పి టి సి గ్రౌండ్ ఎదురుగా
అనంతపురము.
సెల్:-9885412444

* సయాటిక-నడుం నొప్పికి,ఆయుర్వేద చికిత్స *: - * గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ * అనంతపురం లో గత 26 సంవత్సరాలుగా నడుము నొప...
26/12/2025

* సయాటిక-నడుం నొప్పికి,ఆయుర్వేద చికిత్స *: -
* గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ * అనంతపురం లో గత 26 సంవత్సరాలుగా నడుము నొప్పి, సయాటిక (sciatica) జబ్బు తో ఉన్న రోగులను, మరియు ఆపరేషన్ చేయించుకోవలసిన నడుము నొప్పి, సాయాటిక patients కూడా ప్రత్యేక
ఆయుర్వేద చికిత్సా పద్ధతులద్వారా ఉపశమనం పొందారు.

సీనియర్ స్పెషలిస్టు లు, సీనియర్ వైద్యుల పర్యవేక్షణ లో సీనియర్ therapist ల తో చికిత్సలు నిర్వహించబడతాయి.పంచకర్మ మరియు పురుషులకు వేరువేరు పంచకర్మ theater's కలవు.

*సయాటిక-నడుం నొప్పికి,ఆయుర్వేద చికిత్స*

నడుం నొప్పికి గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అనంతపురము లో సంపూర్ణ ఆయుర్వేద చికిత్సా పద్ధతులున్నాయి.
మొదట రోగాన్ని గుర్తించడం, రోగకారణాలను విశ్లేషించడం కారణాలను వర్జించడం, ఆయుర్వేద ఔషధాల తో చేసే శమన చికిత్సలు, ఔషధాలకు లొంగని నడుము నొప్పి కి పంచకర్మ లాంటి శోధన ప్రధానమైనవి.

1. రోగ కారణాన్ని గుర్తించటం:
మొదట రోగి శరీర ప్రకృతి గుర్తించి వారి
నడుం నొప్పికి కారణమైన విషయాలను గుర్తించి, వాటిని త్యజించమని చెప్పటం, వారి ప్రకృతిని బట్టి వారు తీసుకోవలసిన ఆహారాన్ని ఆహార, ఆహార వేళలు, జీవనశైలి మొదలగునవి మార్చటం మొదలగునవి.

* 2.శమన చికిత్స: *
రోగి బలాన్ని, రోగ బలాన్ని, రోగ స్థితిని (stage) అంచనా వేసి నడుము నొప్పికి కారణమైన దోషాలను సమస్థితి కి కలుగచేసే కలుగచేసే ఔషధాలు, సూచిస్తాము.దీనితోపాటు ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజ్ లు సూచిస్తాము.

3. * పంచకర్మ చికిత్స: *
ఔషధాలతో చేసే ఈ శమన చికిత్స వల్ల జబ్బు తగ్గినప్పటికీ కొన్ని వాతవరణపరిస్థితులు, అలవాట్లు, జీవన శైలి మొదలగు కారణాలవల్ల శమించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు.
ఇలాంటి వారికి వ్యాధి తీవ్రతను బట్టి శమన చికిత్సలతోపాటు కొందరికి పంచకర్మ చికిత్స లు కూడా అవసరం. Tox శరీరం లోఉన్న వ్యర్ధ పదార్థాలను (toxins) తొలగించి ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమస్తితి కి తీసుకొనివచ్చి ఆరోగ్యవంతునిగా చేయవచ్చు ..

ఆయుర్వేదలో * స్నేహకర్మ *
ద్వారా ప్రత్యేక
తైలాలతో చేసే అభ్యంగము, స్నేహాపానము లాంటి చికిత్సల వల్ల వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది.

* స్వేదకర్మ * స్నేహ కర్మ అనంతరము చేసే steam బాత్, నాడిస్వేదము, పాత్రపోటలి, కిజి లాంటి స్వేదకర్మల వలన కీళ్లను వదులుగా, మృదువుగా మారేలా చేయటమే కాక కండరాలకు, నరాలకు శక్తిని ఇస్తుంది.

* 1 * వమన కర్మ మరియు 2.విరేచన కర్మ లు *
శరీరం లోని దోషాలను, విషపదార్ధాలను సమూలంగా బయటకు పంపించి కణాలను టిష్యూస్, టిష్యూస్ ను, అన్ని జీవ వ్యవస్థలను శుభ్రం శరీరాన్ని పునరుత్తేజం చెందించే

* కటివస్తి మరియు గ్రీవవస్థీ: *
నడుము నొప్పి, సాయాటిక, మెడనొప్పి, వెన్నునొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబర్ స్పాండిలైటిస్, లాంటి జబ్బులలో పంచకర్మ చికిత్స లో భాగంగా ..
నడుము నొప్పి ఉన్నవాళ్లకు * కటివస్తి * సి మెడనొప్పి ఉన్నవాళ్లకు * గ్రీవవస్థీ * చెయ్యాలి,
ఆయుర్వేదంలో కటివస్తి ఒక విశిష్ఠ ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్‌) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడతుంది.
* 3 & 4 * వస్తికర్మ: * ఆయుర్వేద శాస్త్రంలో
* తైల వస్తి & కాషాయ వస్తి * అనే రెండు రకాల వస్థీకర్మలు పంచకర్మ చికిత్స ముఖ్యమైన చికిత్సలు.

* కాషాయాలతో, తైలాలతో * చేసే
ఈ చికిత్స ద్వారా జబ్బు మూలకారాన్ని తొలగించి జబ్బులను పూర్తి గా నయము చేసే అవకాశము ఉన్న అద్భుతమైన ఆయుర్వేద చికిత్స.

5 * నస్యకర్మ *
పంచకర్మలలో చివరిది ఈ నస్యకర్మ చికిత్స దీనిద్వారా మెడ, ముఖము, శిరస్సు భాగాలలో ఉన్న దోషాలను రూపుమాపడమే కాకుండా శరీరాన్ని అంతా కంట్రోల్ చేసే మెదడును, నాడివ్యవస్థను, హార్మోన్ల సమతుల్యతను కాపాడి శరీరాన్ని రక్షిస్తుంది.

ఈ * పంచకర్మ చికిత్స * లతో శరీర కణాలను, టిష్యూస్ ను, నాడీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మొదలగు అన్ని జీవ వ్యవస్థలను శుభ్రం శరీరాన్ని పునరుత్తేజం చెందిస్తుంది

* సూచనలు:
పంచకర్మ చికిత్స లను చేయించుకున్న తరువాత గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వైద్యుల సలహాలు సూచలను పాఠించడం వలన జబ్బులు తిరిగి రాకుండా శరీరాన్ని కాపాడుకొనవచ్చును.

* గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్,
పి టి సి గ్రౌండ్ ఎదురుగ,
అనంతపురము.
సెల్: 9885412444 .

మాంసాహారం, నిద్రలేమి, ఒబెసిటీ వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ : ICMR అధ్యయనం.Breast Cancer ICMR Study : మ...
26/12/2025

మాంసాహారం, నిద్రలేమి, ఒబెసిటీ వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ : ICMR అధ్యయనం.

Breast Cancer ICMR Study : మాంసాహారం, నిద్రలేమి, ఊబకాయం వంటివి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని బెంగళూరులోని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మూడు కారణాల వల్ల ప్రతి ఏడాది 50,000 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అంచనా వేసింది. అంటే దాదాపుగా ప్రతి ఏటా 5.6 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. పునరుత్పత్తి సమయం, హార్మోన్లు, కుటుంబ చరిత్ర కూడా ప్రధానంగా భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.

అధ్యయనం ప్రకారం
2022లో ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మంది మహిళలు కొత్తగా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ 6,70,000 మంది మరణించారు. భారత్​లోనూ ఎక్కువ మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ సోకుతోంది. 2022లో దేశంలోని 2,21,757 మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. ఇది మహిళలకు సోకిన క్యాన్సర్లలో దాదాపు పావు వంతుకు (22.8 శాతం) సమానం. 2024 డిసెంబర్ 22 వరకు 1,871 వ్యాసాలు, 31 వేర్వేరు ​​అధ్యయనాలను విశ్లేషించి రూపొందించారు.

కారణాలివే!
50 ఏళ్ల తర్వాత మెనోపాజ్ దశకు చేరుకోవడం, వివాహ వయసు, గర్భస్రావ చరిత్ర, మొదటి, చివరి ప్రసవ వయసు, తల్లిపాలు ఇవ్వడం, గర్భనిరోధక మాత్రలు వాడకం, హార్మోన్ల ప్రభావం వంటి వాటిని ఈ అధ్యయనం చేయడానికి పరిగణలోకి తీసుకున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా రొమ్ము క్యాన్సర్ ముప్పు కాస్త ఎక్కువే. అలాగే గర్భస్రావం లేని వారితో పోలిస్తే రెండు కంటే ఎక్కువసార్లు అబార్షన్లు చేసుకున్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ. అలాంటి మహిళలు 1.68 రెట్లు ఎక్కువ రొమ్ము క్యాన్సర్ ముప్పును కలిగి ఉన్నారు.

ఒత్తిడి, సరైన నిద్రలేకపోయినా రిస్కే
మొదటి ప్రసవం ఆలస్యమైతే (30 ఏళ్ల కంటే ఎక్కువ) గణనీయంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు (నడుము-తుంటి నిష్పత్తి 85 సెం.మీల కంటే ఎక్కువ) పేరుకుపోవడం, బీఎంఐ ఎక్కువ ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవనశైలికి సంబంధించిన అంశాల్లో సరిగా నిద్రపోకపోవడం, లైట్లు వేసుకుని నిద్రించడం, తీవ్రమైన ఒత్తిడి కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

అధికంగా మాంసాహారం తింటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్​లు ఎక్కువ. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా, పేలవమైన నిద్ర వల్ల కూడా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అయితే ఆల్కహాల్, పొగాకు వంటి వ్యసనాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనం వెల్లడించలేదు. ఆల్కహాల్ వినియోగం ప్రతి 10 గ్రాములకు 7.1శాతం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని గతంలో ఓ అధ్యయం తెలపడం గమనార్హం. అయినప్పటికీ, తక్కువ ఆల్కహాల్ వినియోగం (రోజుకు 0.4 గ్రాములు) ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

భారత్​లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాపకింద నీరులా ప్రవహిస్తున్న రొమ్ము క్యాన్సర్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి రొమ్ము క్యాన్సర్​పై అవగాహన లేకపోవడం, సామాజిక బిడియం (మొహమాటం) వల్ల వ్యాధి బాగా ముదిరే వరకు టెస్టులు చేయించుకోవట్లేదు. 60 నుంచి 70 శాతం మంది చివరి స్టేజ్​లో వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

రొమ్ములో అసాధారణ కణజాలం పెరిగితే అది క్యాన్సర్​కు దారి తీసే అవకాశం ఉంది. గడ్డలు ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్‌ అని అనుకోకూడదు. తప్పనిసరిగా క్యాన్సర్ సంబంధిత మెడికల్​ టెస్టులు చేయించుకోవాల్సిందే. తొలి దశలోనే గుర్తిస్తే వ్యాధిని వేగంగా తగ్గించుకోవచ్చు. చాలా మందికి రొమ్ము క్యాన్సర్​పై అవేర్ నెస్ లేకపోవడం వల్ల నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

రొమ్ము ఆకృతిలో మార్పు, రొమ్ములో కణితి చేతికి తగిలేలా ఉండటం, చనుమొన నుంచి రక్తం, ఇతర స్రావాలు కారడం, చనుమొన చొట్టపడి లోపలకు పోవడం, గజ్జల్లో వాపు వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రధాన లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు.

Credit:-etvbharat
https://www.etvbharat.com/te/bharat/non-vegetarian-diet-poor-sleep-obesity-associated-with-increased-risk-of-breast-cancer-icmr-study-telugu-news-ten25122405519

సేకరణ.
గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్
పి టి సి గ్రౌండ్ ఎదురుగా
అనంతపురము.
సెల్:-9885412444

ఏ రంగు లో ఉండె అరటి పండు శ్రేష్టం. ఈ పండు చూస్తే అర్థం అవుతుంది.
22/12/2025

ఏ రంగు లో ఉండె అరటి పండు శ్రేష్టం.
ఈ పండు చూస్తే అర్థం అవుతుంది.

21/12/2025

LIVE : కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - WORLD MEDITATION DAY LIVE

World Meditation Day 2025 at Kanha Shanti Vanam : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్షా శాంతి వనంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. అలాగే డీజీపీ శివధర్ రెడ్డి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఒకే వేదికపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ధ్యానం చేస్తున్నారు. ఒత్తిడిమయ పరిస్థితుల్లో ఆటలకు దూరమై, పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. దీని నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం ధ్యాన సాధన దోహదం చేస్తుందని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా వర్చువల్‌ ద్వారా లక్ష మంది ధ్యానం చేస్తారు. కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రత్యక్ష ప్రసారం...

https://www.youtube.com/live/CJB4gIy6zhw?si=350vQcAH3vdDCoQ8

20/12/2025

I gained 5,099 followers, created 70 posts and received 69 reactions in the past 90 days! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

Address

1st. Road Starting, Beside PTC Bridge
Anantapur
515001

Opening Hours

Monday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Tuesday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Wednesday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Thursday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Friday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Saturday 9:30am - 1:30pm
4:30pm - 8:30pm
Sunday 9:30am - 1:30pm

Telephone

+919885412444

Alerts

Be the first to know and let us send you an email when Gokul Ayurvedic Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gokul Ayurvedic Hospitals:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category