Dr.Budda Srikanth Reddy

Dr.Budda Srikanth Reddy jai hind

28/06/2025
ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేసిన  పోరాటానికి నేటికి 50 ఏండ్లు.నాటి ఎమర్జన్సీ గురుంచి క్లుప్తంగా....◆స్వతంత్ర భారత దేశ ...
25/06/2025

ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేసిన పోరాటానికి నేటికి 50 ఏండ్లు.నాటి ఎమర్జన్సీ గురుంచి క్లుప్తంగా....

◆స్వతంత్ర భారత దేశ చరిత్రలో "ఎమర్జెన్సీ" ఓ చీకటి ఘట్టం.ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నియంత ఇందిర ప్రయత్నించిన వైనం.ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్యం వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే.
●1975 జూన్ 25 భారత పౌర హక్కులను కాలరాసిన రోజు.
◆భారత స్వాతంత్ర సమరవీరుల కలలన్నీ కల్లలైపోయాయి.అనేకమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛ.స్వాతంత్ర్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి.దేశ ప్రజలు స్వతంత్ర భారతదేశంలో మరోసారి పోరాటం జరుపవలసిన అవసరం ఏర్పడింది.
◆సమగ్ర ప్రజాచైతన్యం- ఏ జాతి అయినా సక్రమంగా నడవటానికి అవసరం.ప్రజాస్వామ్యంలాంటి ఉదాత్త భావనలను,అలాంటి ఉన్నత జీవనమూల్యాలను కలకాలం నిలుపవలసిన బాధ్యత పాలకులది కాదు ప్రజలదే.ప్రజలలో దానికి కావలసిన సంసిద్ధత లేకుంటే కొద్దిమంది వ్యక్తుల స్వార్థ తప్పిదాలకు దేశంబలైపోతుంది.
◆శ్రీమతి ఇందిరాగాంధీ 1966 జనవరిలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.ఇందిరాగాంధీ అయితే తమ చెప్పుచేతలతో ఉంటుందని భావించిన కామరాజ్ నాడార్ వంటి కాంగ్రెస్ నాయకులు ఆమెకి సంపూర్ణ మద్దతు అందజేశారు.
◆1967 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం పెరిగింది.అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై తల పట్టును బిగించిన ఇందిరాగాంధీ సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి తనకు అనుకూలురైన వారిని ప్రోత్సహిస్తూ తల చుట్టూ ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేసుకుంది.
◆1971 ఎన్నికల్లో "గరీబ్ హఠావో" నినాదంతో ఇందిరాగాంధీ పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించింది.అప్పటినుంచి ఆమెకు కాంగ్రెస్ లో విరోధులు లేని విజేయత లభించింది.భారతసైన్యం సాధించిన'బంగ్లా
విజయం'ఆమె కీర్తిని ఇనుమడింపజేసింది.అయితే ఈ ప్రజా విజయం ఆమెలో వినయం బదులు అహంకారం పెరగడానికి దోహదపడింది.తనకు ఎదురులేదన్న ధీమతో ఇందిరాగాంధీ వ్యవహరించసాగింది.
◆కాంగ్రెస్ పార్టీలో 'వ్యక్తిపూజ'కు అంకురార్పణ ఏర్పడింది.
"ఇందిరయే ఇండియా.ఇండియాయే ఇందిర"అంటూ భజన బృందం ఆమెను కీర్తించసాగింది.
◆ఆకాశవాణి, దూరదర్శన్, ప్రభుత్వ సమాచార ప్రసార విభాగాలు ఇందిర విధానాలకు 'బాకా' ఊదడం ప్రారంభించాయి.
◆ఆదర్శవంతులైన వారు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడంతో పార్టీలో స్వార్థచింతన కలవారే పెత్తనం
చలాయించసాగారు.
◆ 'గాంధీ- నెహ్రూ జిందాబాద్' అనే నినాదంతో తమస్వార్థాలకు పాకులాడిన ఒకవర్గం క్రిందిస్థాయినుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆక్రమించుకుంటూ వచ్చింది. అవినీతిపరులైన అధికారులు సహకారం అందించసాగారు.ఫలితంగా వ్యవస్థ అంతా అవినీతి, అక్రమాలతో కలుషితమైపోయింది.
◆ఈ నేపథ్యంలో 1971 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైంది.అయితే ఆ ఎన్నికలలో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడినందుకు ఆమె ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది.ఇందిరాగాంధీ నియంతృత్వానికి కలిగిన తొలి ఆఘాతమిది.
◆1975 జూన్ 12వ తేదీ భారత న్యాయ వ్యవస్థ లో ఒక సంచలనమైనరోజు.1971 పార్లమెంటు ఎన్నికలలో సోష లిస్టు నేత రాజనారాయణ్ పై లక్షకు పైగా ఓట్లఆధిక్యతతో గెలుపొందింది.ఇందిరాగాంధీ అనేక అక్రమాలకు పాల్పడి గెలుపొందింది అని రాజనారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
◆ఎన్నికల్లో నిబంధనలకు మించి ధనాన్ని వెదజల్లారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకొని ప్రచారం నిర్వహించారని రాజనారాయణ్ తన పిటీషన్ లో ఆరోపించారు.
◆ ఇందిరాగాంధీ ఎన్నికను సవాలుచేస్తూ దాఖలయున
పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్
జగన్ మోహన్ లాల్ సిన్హా విచారించాడు.
◆ గుజరాత్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న రోజులవి.తీర్పు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికల పై ఉంటుందని,అందువల్ల తీర్పు వెలువరించే తేదీని వాయిదావేయాలని కోరగా అందుకు న్యాయమూర్తి సిన్హా అంగీకరించారు.
◆ తీర్పు ఇందిరాగాంధీకి అనుకూలంగా వచ్చేటట్లు అన్నిరకాల ప్రయత్నాలు జరిగాయి. ఒక పార్లమెంటు సభ్యుడు జస్టిస్ సిన్హాకు 50వేల రూపాయలు ఆశ చూపాడుట.సహ న్యాయమూర్తి ద్వారా తీర్పు తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభిస్తుందని సిన్హాకు సంకేతాలు ఇప్పించారు.ఈ ప్రలోభాలు ఏవీ జస్టిస్ సిన్హాపై ప్రభావం చూపలేదు.
◆1975 జూన్ 12వ తేదీన జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ప్రకటించారు.
◆ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 (7) ప్రకారం ఇందిరాగాంధీ రెండు రకాలుగా అక్రమాలకు పాల్పడిందని జస్టిస్ సిన్హా తన 258 పేజీ లో జడ్జిమెంటులో పేర్కొన్నారు.
◆ ఒకటి యశ్ పాల్ కపూర్ అనే గెజిటెడ్ ఉద్యోగి ఉదంతం.రెండవది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చూపిన పక్షపాతం.అంతేకాకుండా ఇందిరాగాంధీ న్యాయస్థానంలో ఇచ్చిన సాక్ష్యం లో 27 అబద్ధాలు చెప్పిందని న్యాయమూర్తి సృష్టం చేశారు.ఎన్నికల చట్టంలో ఈరెండు నేరాల జాబితాలోకి వచ్చేవి. మినహాయింపులు లేనివి.
◆ ప్రస్తుత చట్టాల ప్రకారం ఇందుకు భిన్నంగా తీర్పు ఇవ్వలేమని జస్టిస్ సిన్హా పేర్కొన్నారు.ఇలాంటి కలుషిత వాతావరణంలో ఈరెండు నేరాలు చిన్నవిగా కనిపించవచ్చు.అయితే చట్టాలు అనుశాసనాన్ని, ఆదేశ సూత్రాలను, పరిధులను దాటటానికి వీలు లేదు - అని జస్టిస్ సిన్హా తీర్పులో సృష్టం చేశారు.
◆అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె సుప్రీంకోర్టు లో అపీలు చేసుకున్నది.తను ప్రధాని కనుక ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయడానికి కొంతగడువు కావాలని తన అపీలులో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రముఖ న్యాయవాది నానీ పాల్కివాల ఇందిరాగాంధీ తరుపున వాదనలు వినిపించారు. ఇందిరాగాంధీ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఆమెకు 20 రోజులు గడువు ఇచ్చింది.
◆ అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు.వార్త దేశమంతటా దావానలంలా వ్యాపించింది.అప్పుడే గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
◆ అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఆరు సంవత్సరాల పాటు ఈ ఎన్నికల్లోను పోటీ చేయడానికి అనర్హులని సృష్టం చేయగా,గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.ఈ రెండు తీర్పులు దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపాయి.
◆ Rss,జన సంఘ్ దేశంలో అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయని ఆరెండు ఫాసిస్టు సంస్థలని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ చేసిన ప్రచారాన్ని ఆ రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా ఫ్రంట్ కు పట్టంకట్టారు.
◆1975 జూన్ 12వ తేదీ నుంచి పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన ఇందిరాగాంధీకి నైతికంగా ప్రధానిగా కొనసాగే అర్హత లేదు.అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇందిరాగాంధీ రాజీనామా చేసి ప్రధానిగా మరొకరికి అవకాశం కల్పించి ఉండాల్సింది.ఈ చర్య ఆమె వ్యక్తిత్వానికి హుందాతనం కల్పించి ఉండేది.దేశ గౌరవం కూడా నిలబడేది.
◆ ఇందిరాగాంధీ అధికార వ్యామోహంతో రాజీనామా చెయ్యటానికి అంగీకరించలేదు.ఒకసారి పదవి నుంచి వైదొలిగితే మళ్లీ పదవి లభిస్తుందనే ఆశ ఆమెకు లేదు. రాజీనామా చేయనని ఇందిరాగాంధీ భీష్మించుకుంది.
◆ఇందిర భజనపరులు కూడా జూన్ 12వ తేదీ సాయంత్రం నుంచి ఆమెకు జేజేలు ప్రారంభించారు.1975 జూన్ 14వ తేదీన తన నివాసం ముందు గుమికూడిన ప్రజలను ఉద్దేశించి ఇందిరాగాంధీ మాట్లాడుతూ " ఈ సవాళ్లకు నేను చలించను.దేశానికి నా అవసరం ఎంతో ఉంది.రాజీనామా చేసే ప్రసక్తి లేదు" అని ప్రకటించింది.
◆పత్రికలన్నీ ఇచ్చిన సలహాను, పెద్దల మందలింపులను, ప్రజల ఆగ్రహాన్ని, కోర్టు తీర్పును నిర్లక్ష్యం చేసి పదవిలో కొనసాగడానికి నిర్ణయించుకుంది.
◆తన ఆకాంక్షలకు అనుగుణంగా జూన్ 18వ తేదీన జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో తిరిగి నేతగా ఎన్నికయ్యే ఈ విధంగా పావులు కదిపింది.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇందిరాగాంధీని తమ నేతగా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ పతనం అప్పుడే ప్రారంభం అయింది.
◆అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.జూన్ 15 నుంచి 22 వరకు "ఇందిరాగాంధీ రాజీనామా సప్తాహం" పేరుతో ఆందోళన కొనసాగించాలని నిర్ణయించాయి.
◆అదే సమయంలో ఇందిరాగాంధీ ఒక కోటి రూపాయలు ఖర్చు చేసి జూన్ 20వ తేదీన ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించింది." నేను తప్ప మరోదిక్కులేదు"అదే ధోరణిలో ఆమె ప్రసంగం కొనసాగింది.అయితే ఇందిరకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో సంతకాల ఉద్యమం ప్రారంభమైంది.
◆ఇందిర వ్యతిరేక ఉద్యమానికి కాంగ్రెస్ లో యువ నాయకులుగా పేరొందిన మోహన్ ధారియా, రాంధన్, చంద్రశేఖర్, కృష్ణకాంత్ నేతృత్వం వహించారు.
◆జూన్ 24వ తేదీన సుప్రీంకోర్టులో జస్టిస్ కృష్ణ అయ్యర్ తీర్పునిచ్చారు.అలహాబాద్ హైకోర్టు తీర్పుపై
ఇందిరాగాంధీ చేసుకున్న పిటిషన్ విచారణముగిసి తుదితీర్పు వెలువడేదాకా ఆమె ఆ పదవిలో
కొనసాగవచ్చు.కానీ పార్లమెంట్ సభ్యురాలుగా వ్యవహరించడానికి, జీతభత్యాలు తీసుకొనడానికి,ఓటు వేయడానికి అవకాశం లేదని జస్టిస్ కృష్ణ అయ్యర్ తన తీర్పులో సృష్టం చేశారు.
◆అలహాబాద్ హైకోర్టు,సుప్రీంకోర్టు రెండు ఆమె ఎన్నికను నైతికంగా ప్రశ్నించినట్లే అయ్యింది.అయినప్పటికీ ప్రజా ఉద్యమాన్ని అణచివేసి పదవిలో కొనసాగటానికే ఇందిర నిశ్చయించుకున్నది.
◆ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. అప్పటికే బీహారులో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ విద్యార్థులతో ఉద్యమం ప్రారంభించాడు.క్షాత్ర సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో Abvp కార్యకర్తలు క్రియాశీలంగా వ్యవహరించారు.
◆గుజరాత్ లోని చమన్ భాయ్ పటేల్ సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం విజయవంతం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను మట్టి కరిపించి జనతా ప్రెంటును ఎన్నుకున్నారు.
◆జయప్రకాష్ నారాయణ్ దేశవ్యాప్తంగా ముఖ్య నగరాలలో పర్యటించి కాంగ్రెస్ అవనీతి విధానాలను ఎండగట్టసాగాడు.
◆25వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని రామ్ లీలా మైదానం లో పెద్ద బహిరంగ సభ జరిగింది.మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జయ ప్రకాష్ నారాయణ్ ప్రధాన వక్త.గడిచిన 13 రోజులలో జరిగిన పరిణామాలను
వెల్లడించారు.
◆ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కదలిరావాలని పిలుపునిచ్చారు."లోకసంఘర్షణ సమితి" నేతృత్వంలో ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. దీనికి మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడు.జన సంఘ్ నేత నానాజీ దేశ్ ముఖ్ కార్యదర్శి.అశోక్ మెహతా కోశాధికారి. జయ ప్రకాష్ ఎటువంటి పదవి ఆశించకుండా మార్గదర్శిగా ఉద్యమానికి నేతృత్వం వహించాడు.
◆జూన్ 25వ తేదీ ఉదయం నానాజీ దేశ్ ముఖ్ జనతా మోర్చా నిర్ణయించిన"సత్యాగ్రహం"కార్యచరణ పథకాన్ని ప్రకటించాడు.స్వాతంత్ర పరిరక్షణకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నానాజీ విజ్ఞప్తి చేశారు.మొదటి విడతగా ఢిల్లీలో ఒక వారం రోజులపాటు శాంతియుతంగా ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుoదని నానాజీ ప్రకటించారు.
◆దేశంలో జరుగుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు ఇందిరాగాంధీకి చేరుతున్నాయి.గుజరాత్ అట్టుడికిపోతుంది.ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో ఆందోళన ఉధృతంగా ఉంది.ఈ చిచ్చు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇందిరకు సమాచారం అందించాయి.
◆తాను ప్రధానిగా కొనసాగడానికి ఏదో ఒకటి చేయకతప్పదని ఇందిరాగాంధీ నిర్ణయించుకుంది.తనకు అత్యంత సన్నిహితమైన బృందంతో సమాలోచనలు జరిపింది.ఆ సమాలోచన ఫలితం'ఎమర్జెన్సీ'- అంతరంగిక అత్యవసర పరిస్థితి విధించాలన్న నిర్ణయం.
◆దేశంలో అంతర్ యుద్ధం తలెత్తితే అదుపు చేయడానికి "ఇంటర్ నల్ ఎమర్జెన్సీ" క్లాజును రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు.దీనినే అస్త్రంగా ప్రయోగించాలని ఇందిరాగాంధీ నిర్ణయించింది.హోమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి ఓం మెహతాలను పిలిపించి ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది.
◆ఇందిర వ్యక్తిగత సహాయక బృందానికి తప్ప ఈ విషయం ఇతర క్యాబినెట్ మంత్రులకు ఎవరికి తెలియదు.
◆1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 11 గం.లకు ఇందిరాగాంధీ,సిద్ధార్థ శంకర్ తో కలిసి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహమ్మద్ తో సమావేశమై తమ నిర్ణయాన్ని తెలియజేసింది.రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ దృతరాష్ట్రుని మాదిరిగా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా 'ఎమర్జెన్సీ' విధిస్తూ జారీచేసే ఆదేశంపై సంతకం చేశాడు.అంతే.. అర్ధరాత్రి నుంచి అరెస్టులు ప్రారంభమయ్యాయి.పౌర హక్కులు హరింపబడ్డాయి.
◆ఆ రాత్రి అంతా కేంద్ర మంత్రులు,ఇతర కాంగ్రెస్ నేతల ఇళ్లు సి.ఐ.డి. నిఘాలోనే ఉన్నాయి.మర్నాడు ఉదయం 6 గం.లకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి ఖురానా దేశంలో "ఎమర్జెన్సీ"విధించినట్లు ప్రకటించాడు.పౌర హక్కులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపాడు.మంత్రులు ఎవ్వరు ఎదురు చెప్పలేదు.ఎదిరించితే ఏమి జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే.ఇందిరకు ఎదురుగా నిలిచే ధైర్యం ఎవరికీలేదు.అంతా ఆమెచేతిలో కీలుబొమ్మలే.
◆ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు వార్త అందగానే జయ ప్రకాష్ నారాయణ 'వినాశకాలే - విపరీత బుద్దీ' అని వ్యాఖ్యానించారు.మురార్జీ దేశాయ్ 'అంతా భగవతేచ్ఛ' అంటూ జైలుకు వెళ్లారు.ఆ రాత్రే చౌదరి చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పాయ్,ఎల్.కె అద్వానీ,పీలు మోడీ, చంద్రశేఖర్ తదితరులు అరెస్టయ్యారు.
◆25వ తేదీ అర్ధరాత్రి 400 మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు.Rss సంస్థలో క్రియాశీల సభ్యులను తెల్లవారేలోగా అరెస్టు చేయాలని దేశమంతటా ఆదేశాలు జారీ అయ్యాయి.
◆జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులు ప్రారంభమయ్యాయి.దేశంలో ఒక రకమైన భయానక వాతావరణం ఏర్పడింది.నోరువిప్పితే ఏమి చేస్తారోనన్న భయం అంతటా వ్యాపించింది.
◆ఇందిరాగాంధీకి పూర్తి సహకారం అందించినవారు సి.పి.ఐ పార్టీకి చెందిన కమ్యూనిస్టులు.కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఇందిరాగాంధీ నమ్మలేదు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు,Rss,Vhp తదితర సంస్థల ప్రతినిధులను అరెస్టు చేశారు.
◆ప్రజాస్వామ్యానికి పత్రికా స్వాతంత్ర్యం ఒకమూల స్థoభం.ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ఇందిరాగాంధీ ఆ వార్త బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి పత్రికలపై సెన్సార్ విధించింది.అప్పటికే ఢిల్లీ నుంచి వెలువడే పత్రికలు ఇందిరాగాంధీ పదవిలో ఉండడానికి నైతిక అర్హత కోల్పోయిందoటూ వార్తలు,వ్యాసాలు ప్రచురించాయి.
◆1975 జూలై 4వ తేదీన RSS పై నిషేధం విధించింది.
◆లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వ్యక్తిగత,సామూహిక సత్యాగ్రహాలు జరిగాయి.దేశం నలుమూలల్లో జరిగిన సత్యగ్రహాలలో లక్ష మందికి పైగా అరెస్టయ్యారు.ఈ సత్యాగ్రహంలో 90% మంది RSS కార్యకర్తలే.
◆శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ ద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్రయత్నాన్ని పార్లమెంట్ లోపల, బయట నిలదీయడం జరిగింది. అజ్ఞాత పత్రికలు ప్రజలలో చైతన్యం కలిగించాయు.
◆1977 జనవరి 18 వ తేదీ రాత్రి 8 గంటల 30 ని.లకు ఒక వార్త దేశ ప్రజలందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆరోజు ఇందిర ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ లోక్ సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.జైళ్లలోని నేతలను అందరిని విడుదల చేస్తామని,వారంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని పేర్కొంది.
◆1977 మార్చి 16, 17, 19 తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరి రాజ్యాంగబద్ధంగా తమకు లభించిన 'ఓటు' అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు.
◆1977 మార్చి 21వ తేదీ స్వతంత్ర భారత చరిత్రలో సుదినం.ఎన్నికల ఫలితాలు వెలువడిన పవిత్రమైన రోజు.
◆21వ తేదీ రాత్రి దేశ ప్రజలు ఎవరు నిద్ర పోలేదు. అంతటా! దీపావళి సంబరాలే. బాణసంచా,పాటలు, నృత్యాలు,కేరింతలతో ప్రజలు జనతా పార్టీ అఖండ విజయానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం తొలగిపోయింది.
◆1977 మార్చి 22వ తేదీన ఎమర్జెన్సీ తొలగించబడింది.RSS పై నిషేధం తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడింది.సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాల ఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు.
"భారత్ మాతా కీ జయ్ "

◆ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్  ముఖర్జీ. నేడు వారి పుణ్యతిథి ( j...
23/06/2025

◆ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. నేడు వారి పుణ్యతిథి ( june 23) సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
◆ స్వతంత్ర భారత రాజకీయాకాశంలో సిద్ధాంత రహిత రాజకీయాలు, స్వార్థ , పదవీ వ్యామోహం వాదాల కారుమబ్బులు కమ్ముకున్న ఆ తొలిదినాలలో ఒకమెరుపు మెరిసి మాయమైంది.కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ మెరుపు వెలుగు క్షణ కాలమే కావచ్చు.కానీ గాఢాంధకార భవిష్యత్తులో మునిగివున్న భారత ప్రజానీకానికి ఆమాత్రం వెలుగు చాలు.'భారతీయ జన సంఘం' అనే వాస్తవమైన సైద్ధాంతిక రాజకీయ పథాన్ని కనుగొనడానికి స్వతంత్ర భారత రాజకీయాలకు ఒక నూతన దిశను,నూతన లక్ష్యాన్ని ప్రసాదించిన ఆ మెరుపే స్వర్గీయ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.
◆శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు.వారి జీవితంలో ప్రతిక్షణం,శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి.
◆1901 జూలై 6వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు.తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు పుణికి పుచ్చుకున్నారు.వాటిలో అతి ప్రముఖ గుణం అసుతోష్ ముఖర్జీ యొక్క ప్రఖరమైన, రాజీలేని జాతీయ భావన, అతడి నిర్భీక మనస్తత్వం.
◆శ్యామాప్రసాద్ కు భగవంతుడు ఇచ్చిన మరో వరం అసామాన్యమైన అతడి మేధాశక్తి. అతడి తెలివితేటలు, గ్రహణశక్తి చూసి పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విస్మయం చెందుతూ ఉండేవారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే శ్యామాప్రసాద్ ఎఫ్.ఏ, బి.ఏ విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేస్తుండేవాడు.
◆అతి చిన్న వయసు నుంచి శ్యామాప్రసాద్ ఆదర్శవాదిగా రూపుదిద్దుకోసాగాడు.
◆ 'నేను గొప్ప వ్యక్తిని కావాలి.నాకు ధనం వద్దు' ఒక పుస్తకంలో శ్యామాప్రసాద్ రాసిన మాట అతడి ఆదర్శవాది ఆలోచనలకు తార్కాణం.ఆ విధంగా రూపొందిన ఆదర్శవాదం చిట్టచివరి క్షణం వరకు నిలిచింది .ఆ ఆదర్శవాదమే అతడినొక మహనీయ వ్యక్తిగా రూపొందించింది.
◆1919లో ఇంటర్ పూర్తి ,1921లో బి ఏ ఆనర్స్ పట్టా ప్రధమ శ్రేణిలో 1923 లో ఎం ఏ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
◆1924లో హైకోర్టు న్యాయవాదిగా ప్రవేశం
◆1924 మే నెలలో తండ్రి హఠాత్తుగా స్వర్గస్తులైనారు. అసుతోష్ ముఖర్జీ మరణం బెంగాల్ కు తీరనిలోటు అయింది.
◆తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ నియుక్తులయ్యారు. విశ్వవిద్యాలయాన్ని స్వదేశీ సూత్రాలపై తీర్చిదిద్దేందుకు తండ్రి అసుతోష్ ముఖర్జీ సాగించిన కృషి భారం ఇప్పుడు పూర్తిగా శ్యామా ప్రసాద్ భుజస్కంధాలపై పడింది.అప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే.ఆ తరువాత 15 సంవత్సరాల పాటు విద్యా రంగమే ఆయన సర్వస్వం అయింది.
◆1922 లో శ్యామాప్రసాద్ వివాహం సుభద్రాదేవితో జరిగింది.
◆1933లో కుటుంబంలో తీరని విషాదం సంభవించింది. భార్య సుధారాణి అనారోగ్యంతో మరణించింది.వైవాహిక జీవన ఆనందాన్ని పూర్తిగా అనుభవించకుండానే భార్య వియోగం.
◆1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులు కావడం మరో పెద్ద మలుపురాయి. అప్పటికి వారి వయసు 33 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ గా నియమితులైనది శ్యామాప్రసాద్ జీ.
◆1936 విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ "భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పదనాన్ని సాధించలేదు.పాశ్చాత్యుల నైపుణ్యం ,విజ్ఞానం నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మన సంస్కృతి ,నాగరికతలతో విద్యావిధానాన్ని అనుసంధానం చేయడమే మన ఆదర్శం కావాలి"అని ఆ సమయంలో ఆయన పిలుపునిచ్చారు.
◆1938లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది.శ్యామాప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అయ్యారు.
◆1937లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు.
◆1940 ఫిబ్రవరి 26వ తేదీన మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడింది.
◆1940లో లాహోర్ లో ఉన్న సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థానిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ "నేటి అంధకార బంధురమైన దేశ వాతావరణంలో ఆశాకిరణంగా నాకు సంఘం మాత్రమే కనబడుతుంది" అన్నారాయన.సంఘం పట్ల ఆయనకు గల ఈ ఆదర భావన చివరి వరకు కొనసాగింది.
◆ఒకసారి సంఘ స్థాపకుడైన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ ని శ్యామాప్రసాద్ కలుసుకోవడం తటస్థించింది. సంఘం రాజకీయాలలో ఎందుకు ప్రవేశించరాదని శ్యామాప్రసాద్ డాక్టర్జీని ప్రశ్నించారు.అప్పుడు డాక్టర్జీ మాట్లాడుతూ దైనందిన రాజకీయాలలో సంఘానికి విశ్వాసం లేదని,దేశవైభవ స్థితికి సంఘం పెంచుకున్న మార్గం వేరని శ్యామా ప్రసాద్ కు వివరించారు.
◆శ్యామాప్రసాద్ మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చే సమయానికి బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడింది. సుమారు 30 లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.బెంగాల్ ప్రజల ఆకలి కేకలు శ్యామాప్రసాద్ హృదయాన్ని కదిలించి వేశాయి.వెంటనే "బెంగాల్ సహాయ సమితి" అనే సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు చేశారు.
◆తన కళ్ళ ముందే నాయకుల ద్రోహం కారణంగా మాతృభూమి ముక్కలవుతుంటే చూడలేకపోయారయన.తాను చేయగలిగిందేమీలేదని ఆయనకు తెలుసు.అయినా చిట్ట చివరి క్షణం వరకు విభజనను ఆపేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.
◆1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించింది.సహజంగా దేశ నాయకత్వం సర్దార్ పటేల్ కు లభించవలసింది.13 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలలో 11 కమిటీలు పటేల్ పేరునే సూచించాయి.కానీ గాంధీజీ నెహ్రూనే దేశ నాయకత్వం వహించడానికి ఎంపిక చేశారు.
◆నెహ్రూను దేశ ప్రధానమంత్రిగా ఎంపిక చేస్తూనే గాంధీజీ ఒక యోగ్యమైన నిర్ణయం కూడా చేశారు.తాత్కాలిక జాతీయ ప్రభుత్వం లో కాంగ్రెసేతరులను కూడా చేర్చుకోవడమే ఆ నిర్ణయం.ఆ నిర్ణయం ఫలితంగా స్వాతంత్ర్యాoనంతరం ఏర్పడిన మొదటి జాతీయ ప్రభుత్వం లో 14 మంది మంత్రులలో ఏడుగురు కాంగ్రెసేతరులు కూడా ఉన్నారు.వారిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, జాన్ మత్తయ్ , బలదేవ్ సింగ్, భా భా, కె. సి నియోగి, షణ్ముగం శెట్టి ఉన్నారు.
◆నూతన మంత్రివర్గంలో శ్యామాప్రసాద్ కు పరిశ్రమల శాఖ అప్పగించబడింది.నిజానికి విద్యాశాఖ ఆయన హృదయానికి అతి ప్రియమైనది.విద్యారంగం నుంచే ఆయన రాజకీయ ప్రవేశం చేశారు.ఆయన విద్యామంత్రిగా నియమింపబడి ఉంటే ఆ రంగంలో తనకు గల అపార అనుభవంతో విద్యారంగాన్ని అతి యోగ్యంగా ఆయన తీర్చిదిద్దగలిగి ఉండేవారు.
◆రెండున్నర సంవత్సరాలు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో తన సామర్థ్యాన్ని శ్యామాప్రసాద్ నిరూపించుకున్నారు.చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం,సింద్రీ ఎరువుల కర్మాగారం,హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే మూడు భారీ పరిశ్రమలు నేతృత్వంలో రూపొందినవే.
◆"ఫ్యాక్టరీలో తయారైన మొట్టమొదటి మూడవ తరగతి రైలు పెట్టె సాధారణ భారతీయ రైలు ప్రయాణికుడికి ఎంత మేరకు సౌకర్యంగా ఉంటుందన్న విషయం తెలుసుకునేందుకు నేను స్వయంగా ఆ పెట్టెలు ప్రయాణం చేశాను" అని ఆయన అన్న మాటలు అతిశయోక్తి కాదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తదుపరి మరణించే వరకు ఎక్కువగా ఆయన ఆ మూడవ తరగతి పెట్టెలోనే ప్రయాణించే వారు.
◆ప్రారంభ దినాలలో శ్యామాప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగు దిద్దుకుని భారతీయ జన సంఘానికి,ఆ తరువాత భారతీయ జనతాపార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయింది.
◆1950 ఏప్రిల్ 1వ తేదీన తన మంత్రి పదవికి రాజీనామా లేఖను నెహ్రూ కు పంపారు. వెనకా ముందూ చూడకుండా నెహ్రూ ఆ రాజీనామాను ఆమోదించారు.అయితే శ్యామాప్రసాద్ మంత్రివర్గాన్ని వీడి వెళ్ళడం పటేల్ తదితర సహచరులకు ఏ మాత్రం ఇష్టంలేదు.
◆శ్యామాప్రసాద్ రాజీనామా సమర్పించిన వారం రోజులకు ఏప్రిల్ 8, 1950 నాడు నెహ్రూ- లియాఖత్ ఆలీఖాన్ లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
◆1950 ఆగస్టు 1 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విధంగా రాసింది."నెహ్రూ - లియాఖత్ ఒప్పందం కొనసాగుతున్న హిందూ శరణార్థుల వెల్లువను నిరోధించడంలో విఫలమైంది " అని పేర్కొంది.
◆మంత్రివర్గం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయన ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీకి చెందకపోయినప్పటికీ రాజకీయ వర్గాల్లో ఆయన ఖ్యాతి ఉన్నత స్థానంలో ఉంది. నెహ్రూకు ధీటైన ప్రతిపక్ష నాయకుడు ఆయనే అని దాదాపు అన్ని ప్రతిపక్షాలు భావించే సాగాయి.
◆అయితే శ్యామాప్రసాద్ వీటిన్నింటితో తృప్తిపడలేదు. తాను నమ్మిన ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణమైన ఒక జాతీయ రాజకీయ పక్షం ఉండాలని ఆయన తీవ్రంగా ఆలోచించసాగారు.
◆ఆరోజున దేశంలో దాదాపు ఇదే విషయాన్ని గురించి చాలా తీవ్రంగా తర్జనభర్జన పడుతున్న సంస్థ మరొకటి ఉంది.అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్.హిందూ సమాజంలోని కుల,మత, వర్గ విభేదాలను దూరంచేసి, సంఘటితమైన, శక్తివంతమైన హిందూ సమాజాన్ని నిర్మించాలని, అటువంటి హిందూ సమాజమే భారతదేశ వైభవానికి, ఉన్నతికి ఆధారమని విశ్వసిస్తున్న సంస్థ అది.
◆శ్యామాప్రసాద్ నూతన రాజకీయ పక్షాన్ని ద్వేషించే ప్రయత్నంలో ఉన్నారు. రూపొందబోయే ఆ రాజకీయ పక్షం కాంగ్రెస్ సంస్కృతికి పూర్తి దూరంగా ఉండాలని ఆయన భావించారు.
◆ఆయన దృష్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మీదకు మళ్లింది.సంఘ్ తో శ్యామాప్రసాద్ కు శబ్దం ముందు నుండి పరిచయం ఉంది.సంఘ సిద్ధాంతం,దాని దేశభక్తి, స్వదేశ, స్వధర్మ నిష్టలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి."మేఘావృతమైన దేశాకాశంలో మెరుపు తీగలు మీరు" అని లాహోర్లో ఒక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంఘాన్ని ప్రశంసించారాయన.
◆సంఘ అధినేత శ్రీ గురూజీ తో శ్యామాప్రసాద్ సమావేశమయ్యారు.నూతన రాజకీయ పక్షానికి సంఘం పరోక్ష సహకారాన్ని అందించడానికి శ్రీ గురూజీ అంగీకరించారు.అయితే సంఘం మాత్రం స్వతంత్ర సంస్థగా జాతీయ పునర్నిర్మాణ కార్యాన్ని యధాతథంగా కొనసాగిస్తుందని శ్రీ గురూజీ సృష్టం చేశారు.
◆1951 జనవరి నుంచి నూతన రాజకీయ పక్షాన్ని ప్రారంభించేందుకు శ్యామాప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు.
◆"1951 అక్టోబర్ 21 భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభం". నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ పౌజ్ ను కూడా అక్టోబర్ 21 నాడే ప్రారంభించిన విషయాన్ని శ్యాంప్రసాద్ గుర్తు చేశారు.మాతృభూమి సేవలో అజాద్ హింద్ ఫౌజ్ సాగించిన పోరాటాన్ని భారతీయ జనసంఘ్ కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
◆"జనసంఘ్ ను నేను కాలరాచి పారేస్తాను"అన్న నెహ్రూ బెదిరింపును ప్రస్తావించి "ఈ కాలరాచే మనస్తత్వాన్ని నేను కాలరాచి తీరుతాను"శ్యామాప్రసాద్ సవాల్ విసిరారు.భావి రాజకీయ సంగ్రామానికి ఈ సవాలు ఒక సంకేతం అయింది.
◆1952 ఎన్నికలు ప్రధానంగా శ్యామాప్రసాద్, నెహ్రూల మధ్యనే జరిగాయి.నెహ్రూ తప్పుడు విధానాలను దుయ్యబట్టడంలో ఏ మాత్రం సంకోచించే వారు కాదు.
◆నెహ్రూ వద్ద భారతీయ జనసంఘాన్నీ, శ్యామాప్రసాద్ ముఖర్జీని నిందించేoదుకు ఉన్న పెద్ద ఆయుధం మతతత్వం.
◆1952 ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాలు,33 అసెంబ్లీలు మాత్రమే గెలిపించుకోగలిగింది.
◆ "పార్లమెంటు సింహం" అని శ్యామాప్రసాద్ ప్రఖ్యాతిగాంచారు.పార్లమెంటు సభ్యులు,దేశ ప్రజలు కూడా ఆయనలో ' భావిభారత ప్రధాని' ని దర్శించేవారు. 'సర్దార్ పటేల్ వారసత్వం శ్యామాప్రసాద్ కు సంప్రాప్తించింది' అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వ్యాఖ్య శ్యామాప్రసాద్ కు నిజమైన గౌరవం.
◆కాశ్మీర్ సమస్య గురించి పార్లమెంట్ లో మాట్లాడుతూ " కాశ్మీరీ ప్రజలు మొదట భారతీయులు,తరువాత కాశ్మీరీలా ? లేక మొదట కాశ్మీరీలు తర్వాత భారతీయులా ? లేక మొదటిగా చివరిగా కూడా కాశ్మీరీలే తప్ప భారతీయులు కాదా! నిర్ణయించవలసిన అతి ముఖ్యమైన విషయం అది" అని సమస్య తీవ్రతను సభ్యుల ముందు పెట్టారు.
◆పార్లమెంటులో శ్యామాప్రసాద్ చేసే ప్రసంగాలు అద్భుతంగా,ఎంతో ఆసక్తిదాయకంగా,ఆలోచనాత్మకంగా, ప్రేరణప్రదంగా ఉండేవి.సభ్యులు పూర్తి నిశ్శబ్దంతో, శ్రద్ధతో ఆయన ప్రసంగాలను వినేవారు.
◆ఆయన ప్రసంగాలు గురించి ప్రశంసిస్తూ అప్పటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులలో ఒకరు,జనసత్తా హిందీ దినపత్రిక సంపాదకులు అయిన ప్రొఫెసర్ ఇంద్ర విద్య వాచస్పతి ఒకసారి తన సహజమైన హాస్య ధోరణిలో తన పత్రికలో ఇలా రాశారు.పార్లమెంట్ భవనంలోని రెస్టారెంట్లు, కాఫీ షాపుల యజమానులందరూ తీవ్రంగా ద్వేషించే ఒకే ఒక వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని, ఎందుకంటే, ఆయన మాట్లాడుతున్నంత సేపు సభ్యులందరూ సభలోనే కూర్చుంటారు తప్ప,కాఫీ షాపులకేసి,రెస్టారెంట్లకేసి రారని ఆయన రాసిన మాటలు శ్యామాప్రసాద్ పార్లమెంటరీ సామర్థ్యానికి ప్రశంసలు మాత్రమే.
◆భారతదేశ చరిత్రలో కాశ్మీర్ రాష్ట్రానిదొక విషాదగాథ.ఆ విషాద గాధ లోని అనేక అధ్యాయాలలో భారతీయ జనసంఘ్,శ్యామాప్రసాద్ ముఖర్జీలది కూడా ఒక
అధ్యాయం.మామూలు అధ్యాయం కాదు.అత్యంత ప్రముఖమైన అధ్యాయం.
◆భారతీయ జనసంఘ్ దేశ సమైక్యత కోసం నిలిచిన పార్టీ.కాశ్మీర్ విషయంలో భారతీయ జనసంఘ్ ఆవిర్భవించిన రోజు నుంచి ఈరోజు వరకు ( ప్రస్తుతం భారతీయ జనసంఘ్ లేదు.అయితే అదే ప్రేరణతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసంఘ్ కు మరో రూపం మాత్రమే).
◆దేశ విభజన సమయంలో కాశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం కావాలని జిన్నా ఆశించాడు.అయితే కాశ్మీర్ సంస్థానానికి అధిపతి అయిన మహారాజా హరిసింగ్ తరతరాల కాశ్మీర్ వారసత్వాన్ని,చరిత్రను దృష్టిలో పెట్టుకొని అది భారతదేశంలో భాగంగా ఉండటమే ఉచితమని భావించాడు.
◆1947 అక్టోబర్ లో ఆ సంస్థానాన్ని భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేస్తూ విలీన పత్రాలపై సంతకాలు చేశాడు.
◆1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ సైన్యాలు కాశ్మీర్ సరిహద్దులోని గిరిజనులను తీసుకొని కాశ్మీర్ రాష్ట్రంపై దురాక్రమణ ప్రారంభించాయి.
◆ఈ పరిస్థితులలో సర్దార్ పటేల్,శ్యామాప్రసాద్ తదితరులు ఒత్తిడి మేరకు భారత సైన్యాన్ని కాశ్మీర్ కు పంపించడానికి నెహ్రూ అంగీకరించారు.దాదాపు సంవత్సరానికి పైగా ప్రయత్నం తర్వాత చాలావరకు పాక్ సేనలను కాశ్మీర్ నుంచి భారత సైన్యం తిప్పికొట్టగలిగింది.
◆అయితే 1949 జనవరి ఒకటినాడు హఠాత్తుగా ప్రధాని నెహ్రూ భారత సైన్యానికి కాల్పుల విరమణకు ఆదేశం ఇవ్వడంతో 1/ 3 వంతు కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ చేతుల్లో ఉండిపోయింది.భారతదేశం దానిని 'ఆక్రమిత కాశ్మీర్' అని పిలువసాగింది. పాకిస్తాన్ మాత్రం అది 'ఆజాద్ కాశ్మీర్' అని ప్రకటించింది.
◆ఒకపక్క కాశ్మీర్లో భారత వ్యతిరేక,జమ్మూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ షేక్ అబ్దుల్లా మరోప్రక్క నెహ్రూతో సన్నిహితంగా వ్యవహరిస్తూ,కేంద్ర ప్రభుత్వం తనకుకూలంగా వ్యవహరించేటట్టు ప్రయత్నాలు చేయసాగాడు.ఆ ప్రయత్నాలలో నుంచి పుట్టుకొచ్చినదే కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ మన రాజ్యాంగంలో చొప్పించబడ్డ 370 వ అధికరణ.
◆కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించమని షేక్ అబ్దుల్లా రాజ్యాంగ సంఘానికి అధ్యక్షుడైనా డా.బి.ఆర్.అంబేద్కర్ కోరినప్పుడు అంబేద్కర్ ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు.
◆చివరికి నెహ్రూ ఒత్తిడి కారణంగా రాజ్యాంగంలో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 370 వ అధికరణ చేర్చబడింది.
◆షేక్ అబ్దుల్లాకు 370 వ అధికరణం అతడి భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక లైసెన్స్ అయుంది.
◆ఇక శ్యామాప్రసాద్ ముందు తెరిచి ఉన్న ఏకైక మార్గం భారతీయ జనసంఘ్ ద్వారా ఉద్యమించడమే.1952 జూన్ 14 న జరిగిన కార్యవర్గ సమావేశాలలో జనసంఘ్ కాశ్మీర్ పరిస్థితిపై తీర్మానం ఆమోదించింది.
◆1952 జూన్ 26 వ తేదీన పార్లమెంటులో శ్యామాప్రసాద్ కాశ్మీర్ సమస్యపై ప్రసంగించారు.ప్రత్యేక జెండా,ప్రత్యేక ప్రధానమంత్రి,370వ అధికరణ ,ప్రత్యేక రాజ్యాంగం వగైరా అంశాలపై ఆయన ఆ ప్రసంగంలో ఉల్లేఖించారు.
◆1952 జూన్ 29 తేదీ నాడు దేశవ్యాప్తంగా కాశ్మీర్ దినాన్ని జరుపవలసిందిగా జనసంఘ్ పిలుపునిచ్చింది.
◆పార్లమెంటులో శ్యామాప్రసాద్ చేసిన గొప్ప ప్రసంగాలలో 1952 ఆగస్టు 2 నాడు ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం పైన చేసిన ప్రసంగం అధ్బుతం.
◆రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు.రాజనీతిజ్ఞుడు రాబోయే తరానికి గురించి ఆలోచిస్తాడు అంటారు పెద్దలు.శ్యామాప్రసాద్ భావితరాల గురించి ఆలోచించారు.ఆయన ప్రతి విషయంలోనూ జాతీయ దృష్టి కోణమే.
◆1952 మే 21వ తేదీన తొలిసారిగా తొలి పార్లమెంటులో చేసిన ప్రసంగంలోనే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో సంభవించిన తీవ్రక్షామం గురించి ప్రస్తావించారు.
◆1953 ఫిబ్రవరి 14 నాడు పార్లమెంటు లో ప్రసంగిస్తూ కాశ్మీర్ సమస్యను గురుంచి నిర్మల హృదయంతో ఆలోచించమని ప్రభుత్వ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
◆జమ్మూలో ప్రజల పై పెరుగుతున్న ఘోరమైన అణచివేత చర్యలకు వ్యతిరేకంగాను,సమావేశం,భావ ప్రకటన వగైరా తమ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకునేందుకు దేశవ్యాప్తంగా 1953 మార్చి 5న 'జమ్మూ- కాశ్మీర్ దినం 'నిర్వహించాలని పిలుపునిచ్చారు.
◆జమ్మూలో పోలీసుల కాల్పులలో మరణించిన దేశభక్తుల చితాభస్మాన్ని మరునాడు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమగ్నం చేయడం జరుగుతుందని సభలో ప్రకటించబడింది. అయితే మరునాడు హఠాత్తుగా ప్రభుత్వం తిరిగి నిషేధం విధించింది.
◆స్వయంగా జమ్మూ కి వెళ్లి సత్యాగ్రహంలో పాల్గొనాలని శ్యామాప్రసాద్ నిర్ణయించుకున్నారు.పర్మిట్ కు సంబంధించిన వివరణలు కోరుతూ రక్షణ మంత్రికి లేఖ రాశారు.మంత్రి నుండి సమాధానం ఏమి రాలేదు.
◆జమ్మూ బయలుదేరేముందు ఎందుకో తన వయోవృద్ధ మాతృమూర్తిని దర్శించి రావాలని ఆయనకు కోరిక కలిగింది.బహుశా అది భగవత్ సంకల్పం ఆయు ఉండవచ్చు.
◆1953 మే 8 వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు శ్యామాప్రసాద్ జమ్మూ యాత్ర ప్రారంభమైంది.
◆బయలుదేరేముందు తాను ప్రభుత్వం నుంచి పర్మిట్ తీసుకోకపోవడానికి కారణం వివరిస్తూ శ్యామాప్రసాద్ " భారతదేశంలో జమ్మూ - కాశ్మీర్ విలీనం నూటికి నూరు శాతం సంపూర్ణమని నెహ్రూ పదే పదే ప్రకటిస్తున్నారు. అయినా భారత ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందితే గాని ఎవరూ ఆ రాష్ట్రంలోకి ప్రవేశించరాదనడం ఆశ్చర్యకరం" అని వ్యాఖ్యానించారు.
◆1953 మే 11వ తేదీన శ్యామాప్రసాద్ అరెస్టు.
◆శ్యామాప్రసాద్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఢిల్లీలోనూ ఇతర చోట్ల ర్యాలీలు,ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి."జమ్మూ చలో" నినాదంతో సత్యాగ్రహులు పెద్ద సంఖ్యలో పర్మిట్లు లేకుండా జమ్మూ వైపు బయలుదేరారు.
◆1953 మే 12న శ్రీనగర్ జైలుకు చేర్చి, అక్కడి నుండి దాల్ సరస్సు సమీపంలోని కొండవాలులో ఉన్న ఒక అతిథి గృహానికి శ్యామాప్రసాద్ ను తరలించిన నాటి నుంచి జూన్ 23న ఆయన అంతిమ శ్వాస విడిచే వరకూ గడిచిన భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైనవిగా చెప్పక తప్పదు.
◆శ్యామాప్రసాద్ హఠాన్మరణం అనేక అనుమానాలకు దారితీసింది.కాశ్మీర్ భూభాగంపై తన అరెస్టును గురించి వ్యాఖ్యానిస్తూ 'ఇది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్ర' అన్న శ్యామాప్రసాద్ వ్యాఖ్య దగ్గరనుంచి మొదలుపెట్టి ప్రభుత్వ విచారణకు నెహ్రూ తిరస్కరించడం వరకు అనేక అంశాలు శ్యామాప్రసాద్ మరణం సహజమైనది కాదని,ఆయనను వైద్యపరంగా చంపబడ్డారని(Medical Murder) అనుమానాన్ని దృఢ పరిచాయి.
◆శ్యామాప్రసాద్ మరణం జాతికి ఆశనిపాతం అయుంది. ఆ వార్త విని జాతీయ యావత్తు క్షణం నిర్ఘాంతపోయింది. మరుక్షణం తల్లడిల్లిపోయింది.దేశమంతా శోకసముద్రంలో మునిగిపోయింది.దేశమంతటా సంతాప ప్రకటన ప్రారంభమైంది.
◆ "మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యామాప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్రభాగాన నిలిచి బలిదానం చేశారు".
◆శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమే అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ , నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 వ అధికరణను తొలగించి,వారికి ఘనమైన నివాళి అర్పించింది.
* భారత్ మాతా కీ జయ్ *

ఉయ్యాలవాడ మండలంలో నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం జరిగింది అలాగే...
23/06/2025

ఉయ్యాలవాడ మండలంలో నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం జరిగింది అలాగే వికసిత భారత్ 2047 ప్రతిజ్ఞ వారి చేత చేయించడం జరిగింది.

వికసిత భారతదేశపు అమృతకాలం, సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కోవెలకుంట్ల మండలంలో జర...
20/06/2025

వికసిత భారతదేశపు అమృతకాలం, సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కోవెలకుంట్ల మండలంలో జరిగిన వికసిత భారత్ సంకల్ప సభలో పాల్గొనడం జరిగింది

ఒకటిగా ఉంటేనే హిందువులకు సురక్షితం
10/11/2024

ఒకటిగా ఉంటేనే హిందువులకు సురక్షితం

30/11/2023

హైదరాబాదులో ఓటు ఉన్న మా బంధువులందరూ బిజెపికి ఓటు వేశారు

29/11/2023

E w s రిజర్వేషన్ తీసేయాలని కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది

29/11/2023

మన ధర్మం పదికాలాలపాటు ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి

ప్రధాని నేతన్యాహు కుమారుడిని యుద్దానికి.పంపుతూ. ఇది దేశభక్తి
14/10/2023

ప్రధాని నేతన్యాహు కుమారుడిని యుద్దానికి.పంపుతూ.
ఇది దేశభక్తి

Address

Atmakuru
518501

Telephone

+919849996602

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Budda Srikanth Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Budda Srikanth Reddy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category