13/03/2026
ఉన్మాదంగా ప్రవర్తించే హీరోలు,హీరోయిన్ ల పాత్రలు ఉన్న సినిమాలు,సీరియళ్లు చూసి చూసి,జనం లో ఉన్మాదం అవహించినట్లుంది.ఈ మధ్య ఒకావిడ తాను తన పిల్లలతో సహా రైలు కి అడ్డంగా పడుకుని ఆత్మహత్య చేసుకుంది .ఈవిడ ఎవరో భర్త వద్దన్నా మరో బోరు వెయిస్తున్నాడు అని తన ముగ్గురు పిల్లల తో సహా పక్క వాళ్ళ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.అందులో ఒక పిల్లాడు ఆయుష్షు ఉండి బ్రతికాడు.
ఇటీవల పిల్లల్ని చంపుతున్న తల్లితండ్రల ప్రవర్తన గమనిస్తూ ఉంటే మగవాళ్ళు ఆలీ మీద అనుమానం తోనో, అడపిల్లల్ని పెంచలేమనో పిల్లల్ని చంపుతుంటే,తల్లులు ఏమో,మొగుడి మీద కోపం తోనో,ఆర్థిక బాధలకు తట్టుకోలేక,తాము లేకపోతే తమ పిల్లలు బ్రతకలేరు అనే అభద్రతా బావం లేక పిల్లలు తనకు మాత్రమే స్వంత అస్తి అన్నట్లు వారిని కూడా తనతో పాటు తీసుకు వెలిపోదాం అనే ఆ ఉన్మాదపు క్షణాన అనిపించినందుకు ఇలా మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారూ కాబోలు.
350 అడుగులు త్రవ్వినా చుక్క నీరు పడలేదంటే,ఆ ఏరియాలో భూగర్భ జలాలు లేవనే ఆలోచన రావాలి రైతు అనే వాడికి.కొంతమంది రైతులు ఈ బోర్లు త్రవ్వించే విషయం లో పేకాట లో డబ్బు పోయినోడు మాదిరి ఒక రకమైన ఉన్మాదంతో ఊగిపోయి, ఒక బోరు ఫెయిల్ అయితే,మరొక బోరు ఇలా వరుస గా వెయిస్తూ,డబ్బులు అన్ని నాశనం చేసుకుంటారు.భూమి అడుగున నీటిని నిలువ ఉంచుకోగల పోరల రాయి ఉంటే అక్కడ బోర్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.వాటిని జియాలజిస్ట్ ద్వారా పరీక్ష చేయిస్తే తెలుస్తుంది.అది తెలియనందుకే ఈ కుటుంబం లో ఇల్లాలు ఈ దుశ్శర్య కు పాల్పడింది.
భారత రాజ్యాంగం తనకు నచ్చిన వారిని ప్రేమించే హక్కు,పెండ్లి చేసుకునే హక్కు ఇచ్చింది కానీ,తన పిల్లల్ని చంపుకునే హక్కు కాదు కదా,చివరకు తన ప్రాణాలు తాను తీసుకునే హక్కు కూడా తన పౌరులకు ఇవ్వలేదు .కాబట్టి చట్టపరంగానే కాదు,దేవుని దృష్టిలోను ఆత్మహత్య మహాపాపం.