22/04/2026
వావ్!భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతు కమతానికి భూదార్ ఇస్తాం అని రెవిన్యూ మంత్రి గారు గత రెండేళ్లుగా చెపుతుంది ఇన్నాళ్లకు తొలిసారిగా ఆవిష్కృతమైంది అన్న మాట.సంతోషం.ఇపుడు మాకు అర్థం అయింది ఏమిటంటే:
1).రైతు భూ కమతానికి భూదార్ రావాలంటే ఆ రైతు ఖచ్చితంగా తన భూమిని వేరేవారికి అమ్మి తీరాలి.
2)ఆ భూమికి తానే సర్వే చేయించుకుని,సదరు సర్వే మాప్ తో సేల్ రెజిస్ట్రేషన కోసం భూభారతిలో అప్లై చేస్తే,తహశీల్ధార్ గారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి,సరిహద్దు రైతుల తో అభ్యంతరం లేదని దృవీకరించుకుని,అప్పుడు ఆ కమతానికి,భూదార్ నంబర్ కేటాయించి,ఆ నంబర్,సర్వే మాప్ తో రిజిస్ట్రేషన్ చేస్తారు అన్న మాట.అలా తెలంగాణ లో తొలి రెజిస్టేషన్ కూసుమంచి మండలం మోటాపురం గ్రామం లో ఎకరం పై చిలుకు కు చేసి,తొలి భూదార్ నంబర్ కేటాయించారు.
3).అయితే ,రాష్ట్రం లో ఉన్న కోట్లాది ఎకరాల భూమి కమతాల మొత్తానికి భూదార్ నంబర్ లు కేటాయించాలి అంటే ఎన్ని శతాబ్దాలు పడుతుంది?
4).రైతు తన భూమిని ఎవరికి అమ్మక పోతే,అతని భూ కమతానికి భూదార్ నంబర్ రానట్లేగా!?ఎందుకంటే భూదార్ నంబర్ రావాలంటే సర్వే మాప్ ఉండాలి.అది అతనికి అవసరం అయ్యేది తన భూమిని వేరే వ్యక్తికి అమ్మెటప్పుడు మాత్రమే.అప్పటి వరకు ప్రభుత్వం మీ భూమికి భూదార్ ఇవ్వదు.
5).ప్రభుత్వం రాష్ట్రం లోని మొత్తం భూమికి భూదార్ కేటాయింపు కోసం రీ సర్వే జరపాలంటే చేయించాలి అంటే 2029 ఎన్నికల్లోపు అది సాధ్యం కాదు,పైపెచ్చు చాలా రిస్క్ అని అభిప్రాయానికి వచ్చి,ఇలా రైతుల భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ సమయం లో మాత్రమే భూదార్ కేటాయింపు చేయడానికి,సర్వే మాప్ కంపల్సరీ చేసింది.
6).ఏ రెవిన్యూ గ్రామం లో అయినా సరే,ఒక్క కమతానికి అయినా అమ్మకం జరిగి,భూదార్ కేటాయించబడితే,ఇక ఆ గ్రామము లో భూభారతి సక్సెస్ అయినట్లే.
7)మరి ఇప్పటివరకు ఉన్న పాస్ బుక్ లు,పహానిలు ఎందుకు అంటే,మీ భూమిని వేరేవారికి అమ్ముకోవడానికి మాత్రమే .మీకు భూదార్ తో కూడిన భూమి కావాలంటే,మీరు ఎవరి దగ్గరైన కొనాల్సిందే.లేదంటే మీ భూమిని మీ బంధువుల పేర రిజిస్ట్రేషన్ చేయించి,తిరిగి మీ పేరున రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అప్పుడు ప్రభుత్వానికి డబుల్ రిజిస్ట్రేషన్ పిజు గ్యారంటీ.మీ భూమికి భూదార్ నంబర్ గ్యారంటీ.
తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని ఈ విషయం లో క్లారిటీ కోరుతున్నాం.