26/04/2026
ఈ రోజు 26- 04. 2026 , ఆదివారం చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్
సహకారంతో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు జిల్లా వారు మరియు జిల్లా అందత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో
పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినా Dr. చల్లగుండ్ల శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది.
కంటి సమస్యలతో బాధపడుతున్న 263 మంది రోగులకు కంటి పరీక్షల తో పాటుగా బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి వీరిలో 126 మందిని కంటి శుక్లముల శస్త్ర చికిత్సల పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి కి రిఫర్ చేయడం జరిగింది.ఈ శిబిరం నందు శంకర కంటి ఆసుపత్రి చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ షహనా, డాక్టర్ రమ్య సాయి గార్లతో పాటుగా చల్ల గుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు , బండారు చిరంజీవి గారు, చల్లగుండ్ల నాగేశ్వరరావు గారు, అక్కినపల్లి సైదులు గారు, గూడూరి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటుగా శంకర కంటి ఆసుపత్రి క్యాంప్ రవి కుమార్ , పారామెడికల్ స్టాఫ్ మరియు వాగ్దేవి కాలేజీ విద్యార్థులు పాల్గొని తమ వంతుగా స్వచ్ఛందంగా సేవలందించారు ప్రజలందరూ పాల్గొని ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు.