14/07/2023
ఉప్పు - తప్పు
మీ ఇంట్లో నలుగురు సభ్యులు .
ఒక కిలో ఉప్పు ఎన్ని రోజులకు వస్తుందేంటి ?
✔️మెడికల్ సైన్స్ లెక్క ప్రకారం ఒక మనిషికి రోజుకి 2 .3 గ్రాముల ఉప్పు .
👉అంటే ఒక కిలో ఉప్పు మూడు నెలలు రావాలి . ఇంట్లో ఇద్దరు ఉంటే ఆరు నెలలు రావాలి. కేవలం టేబుల్ పై పెట్టి మీరు మజ్జిగ లేదా పెరుగు అన్నానికి, జామ లేదా మామిడి కాయలు తినేటప్పుడు వాడే ఉప్పు లెక్క కాదు .
వంటింట్లో వివిధ ఆహార పదార్థాలు వండడానికి... దానికి అదనంగా మీరు డైనింగ్ టేబుల్ పై పెట్టుకొని తినేటప్పుడు వాడే ఉప్పు .. ఇలా మొత్తంగా వాడే ఉప్పు లెక్క ఇది .
👉ఇంతకంటే అదనంగా తింటే..
1 . బిపి పెరుగుతుంది .
2 గుండెపోటు ప్రమాదం .
3 అన్నింటికీ మించి అధిక ఉప్పు కీళ్ల సందుల్లోకి వెళ్లి కూర్చొని అక్కడ ఉన్న సైనోవియల్ ద్రవాన్ని తాగేస్తుంది . దీనితో కీళ్ల నొప్పులు . నడుము నొప్పి . కూర్చుంటే లేవలేరు . లేస్తే కూర్చో లేరు .
👉సగటున ఒక మనిషి నేడు తీసుకోవలసిన దానికన్నా ఆరురెట్లు అధిక సోడియం ను శరీరం లోకి పంపిస్తున్నాడు . ఇదొక ఆరోగ్య ఉపద్రవం గా మారింది .
"చదుతున్నామని ఏదో చెబుతారండీ .. అయినా ఉప్పు లేకుండా ఎలా తింటాము ? చప్పిడి కూడు తిని బతికే బతుకూ ఒక బతుకేనా ? అయినా మన తాతముత్తాతలు ఇలా త్రాసు పెట్టుకొని లెక్క పెట్టుకొని తిన్నారా ? హాయిగా మనసుకు ఏది నచ్చితే అది తిన్నారు . గుండ్రాయిలా జీవించారు . అయినా ఎక్కువ రోజులు బతికి ఏమి చేస్తాము ?".. ఇది చాల మంది ఆహార ప్రియుల ఆలోచన .
బ్రతకడానికి తినేవారు కొందరు .. తినడానికి బ్రతికే వాళ్ళు కొందరు . ఆధినిక ప్రపంచం లో ముఖ్యంగా నగరాల్లో సంపద పెరిగే కొద్దీ రెండో కేటగిరీ వారి సంఖ్య పెరుగుతోంది .
ఎన్నాళ్ళు బతికామనేది తరువాతి లెక్క . అధిక బిపి తో .. అధిక బరువుతో కీళ్ల నొప్పులతో.. గుండెకు స్టింట్ లు
వేసుకొంటూ రోజుకు గుప్పెడు మాత్రలు తింటూ బతకడమేనా ? ఆరోగ్యంగా జీవించాలి అనే ఆలోచన వద్దా? కనీసం రాబోయే తరాల వారైనా ఆరోగ్యంగా జీవించాలి అని ఆలోచించక పొతే అది పెద్దరికం అవుతుందా ?
ఉప్పు తగ్గించాలి అంటే ఉప్పు లేని తిండి తినమని కాదు . ఇలా చెయ్యండి .
1 . పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కు .. ఇడ్లీ , దోస , సాంబార్, చట్నీ కి బదులుగా .. మొలకెత్తిన పెసలు , నాన పెట్టిన బాదం , వాల్నట్ , పిస్తా పప్పు , కోడిగుడ్డు తెల్ల సొన తినండి .
2 . ప్రతి పూటా దోసకాయ { కీరా } ఒకటి తినండి . సగం కడుపు దీనితో నిండిపోతుంది . శరీరానికి వెళ్లే ఉప్పు శాతం తగ్గిపోతుంది . ఖీర తో పాటూ క్యాబేజీ లాంటి సలాడ్స్ తీసుకోండి . అధిక బరువు ఉన్నవారు షుగర్ ప్రాబ్లెమ్ ఉన్నవారు బీట్రూట్ క్యారెట్ తీసుకోవద్దు .
౩. జామకాయ మామిడి కాయ లాంటివి తినేటప్పుడు ఉప్పు అవసరం లేదు . పచ్చివిగా తినండి . టేస్ట్ ఎంజాయ్ చెయ్యండి .
4 . మజ్జిగ / పెరుగు అన్నానికి ఉప్పు వేసుకోవడం తప్పనిసరి . లేక పొతే చప్పగా ఉంటుంది అనుకొంటున్నారు కదా ? మూడు రోజులు పాటూ ఉప్పు లేకుండా తినండి . మొదట్లో చప్పగా రుచీపచీ లేనట్లు ఉంటుంది . అన్నాన్ని బాగానమిలి తినండి . వారం తిరిగాక ఉప్పు వేసిన మజ్జిగ / పెరుగన్నం ఎంత చెత్తగా ఉంటుందో . ఇన్నాళ్లు దేన్నీ కోల్పోయారో అర్థం చేసుకొంటారు . జస్ట్ నాలుగు రోజులు ట్రై చెయ్యండి .
5 . తాజా పళ్ళు ఆకు కూరలు కాయగూరలు బాగా తినండి . బియ్యం గోధుమ తో చేసిన ఆహార పదార్తాలు తగ్గించండి . పళ్ళు కాయగూరలు { కాయగూరల్లో దుంప కూరలు కూడదు . ఇవి బియ్యం తో సమానం } ఎంత ఎక్కువ తింటే... అన్నాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది . షుగర్ ఉన్న వారు పళ్ళు తినొచ్చా ? ముందుగా ఒక పాయింట్ చెప్పుకోవాలి . చిన్నపటినుంచి పళ్ళు ఆకుకూరలు కాయగూరలు బాగా తింటే షుగర్ సమస్య రాదు . షుగర్ సమస్య ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్తలను బాగా తగ్గించి సాయంకాలం పొద్దున్న కొద్దీ పాటీ పళ్ళు ఖాళీ కడుపున తీసుకోవచ్చు . బాగా తియ్యగా వుండే మామిడి ద్రాక్ష లాంటివి కాకుండా జామ కివి లాంటివి షుగర్ వున్నవారికి మంచిది .
✔️ఆహారం లో పైన అయిదు పాయింట్లలో చెప్పిన మార్పులు తెస్తే .. మీ ఒంటి లోనికి వెళ్లే ఉప్పు తగ్గిపోతుంది .
1. రెండు నెలలో బిపి కంట్రోల్ లోకి వచ్చేస్తుంది .
2 . గుండెపదిలం .
3. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి .
పైన చెప్పినవి తక్కువ క్యాలోరీల ఆహారం . దీని వల్ల 4. ఆరునెలల్లో సన్నబడుతారు .
5 షుగర్ సమస్య తగ్గిపోతుంది .
6. పళ్లుకాయగూరల్లో అంటి యాక్సిడెంట్ లు ఉంటాయి .. దీని వల్ల కాన్సర్ నుంచి రక్షణ .
7 . దీనికి తోడు పీచు సమృద్ధిగా ఉంటుంది . దీని వల్ల అజీర్తి అల్సర్ లాంటి సమస్యలు దరిచేరవు . మంచి ఫ్యాట్స్ అంటే ఒమేగా - ౩ ఫాటీ ఆసిడ్స్ శరీరానికి అందుతుంది .
8 దీని వల్ల కొలెస్ట్రొల్ సమస్య పారిపోతుంది .
9. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది .
10 . మెదడు చురుకుగా మారుతుంది .
ఎన్ని ఉపయోగాలో !
మరెందుకిక ఆలస్యం .
నేడే మీ ఆహారం లో పైన చెప్పిన మార్పులు తీసుకొని రండి .
పైన చెప్పిన మార్పులు చేస్తే ఒంట్లోకి వెళ్లే అధిక ఉప్పు వెళ్లకుండా నివారించగలుగుతామా ?
లేదు . నివారించలేము !
షాకింగ్ గా వుంది కదా ?
ఇంకా చదవండి .
ఉప్పు .. అంటే సోడియం క్లోరైడ్ .
శరీరానికి రోజుకు అర్ధ మిల్లి గ్రాము సోడియం చాలు { పైన చెప్పిన రెండు రెండు గ్రాములు ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ లెక్క . ఇప్పుడు చెబుతుంది సోడియం లెక్క } . అసలు విలన్ సోడియం . అధిక మొత్తంలో సోడియం తింటే అనేక సమస్యలు .
నగరజీవుల్లో అధిక సోడియం కు డెబ్భై శాతం కారణం ప్యాకెట్ ల డబ్బాల్లో వచ్చే ఆహార పదార్థాలు . బిస్కెట్ ల.. కేకు లు .. పిజ్జా లు బర్గర్ లు .. పొటాటో చిప్స్ , పాప్ కార్న్ ..రెడీ టు కుక్ ఫుడ్ ప్యాకెట్ లు... వీటిలోదారుణ మొత్తం లో సోడియం ఉంటుంది .
అసలు సమస్య కు ఇవే కారణం .
మీరు వారమంతా ఉప్పు దట్టించిన ఇంట్లో వండిన ఆహార పదార్థాలు బాగా తింటే ఒంట్లోకి ఎంత ఉప్పు చేరుతుందో .. వారం లో ఒక రోజు .. ఇలా ప్యాకెట్ ల లో డబ్బాలో వచ్చే ఫుడ్ తింటే అంత అధిక సోడియం వొంటిలోకి చేరుతుంది .
అదేంటి లెక్క ? ప్యాకెట్ ల దొరికే ఆహార పదార్తాల్లో అంత ఉప్పు ఉంటుందా ? అయితే బాగా ఉప్పగా ఉండాలి గా .. అప్పుడు మనం తినలేము గా అనుకొంటున్నారా ? ఉప్పు కాదండీ.. ఇందులో సోడియం భారీగా ఉంటుంది . 1. ఆహారానికి రుచి రావడానికి 2. ఎక్కువ కాలం నిల్వయుండడానికి 3. కరకరలాడేలా ఉండడానికి వీరు అధిక మొత్తం లో బేకింగ్ సోడా లాంటివి కలుపుతారు . అంటే అధిక సోడియం .
ఇప్పడు అర్దమయ్యిందా ? తాతముత్తాతలు ఎందుకు కడుపు నిండా తినగలిగారో ?
వారిలా ఆరోగ్యంగా ఉండాలంటే ..
ప్యాకెట్ ల వచ్చే ఆహార పదార్థాలు చేసే కీడు గ్రహించండి . వారు సోడియం విషాన్ని కలిపి రుచి పేరుతొ మన ప్రాణాలు తీస్తున్నారని గ్రహించండి . సహజ ఆహార పదార్థాలు .. అంటే గేగులు , తాటినుంజెలు , రేగు పళ్ళు , జామ కాయలు ఇంకా ఆయా కలల్లో దొరికే పళ్ళు ఆకు కూరలు కయ గూరలు బాగా తినండి .
ఆరోగ్యం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు . కడుపునిండా తినొచ్చు . తినాలి .
ఏమి తింటున్నాము అనేది ముఖ్యం .
EAT RIGHT ! LIVE HEALTHY !!
సరైన ఆహరం తీసుకోండి .
ఆరోగ్యంగా .. ఆనందంగా జీవించండి .
వెల్నెస్కోచ్ పోషకాహార నిపుణులు.
సుధాబాల.మానేపల్లి
😊🙏🏻