20/03/2026
శ్రీరామ్ హాస్పిటల్ రంజాన్ తోఫా - 2026:
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరుసగా 9వ సారి నిన్న 19/3/2026 సాయంత్రం "రంజాన్ తోఫా - 2026" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
శ్రీ పరాభవ నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున మన శ్రీరామ్ హాస్పిటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుపేదలైన 150 ముస్లిం కుటుంబాలకు 10 కేజీల బియ్యం తో పాటు 10 వివిధ రకాల నిత్యావసర సరుకులను అందించాము. సహనం, సేవ, దాతృత్వం మరియు సోదర భావాన్ని పెంపొందించే రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషం కలిగిస్తుంది.
ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విద్యా వైద్య రంగాలలో మేము చేస్తున్న వివిధ సేవలను కొనియాడారు. తోఫా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ గారు , ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు గారు , సూర్య సిరి ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ గారు ,వర్మ గ్రాండ్ అధినేత రంగా రావు గారు ,పిన్ని శ్రీనివాస రావు గారు, సినీ నటులు దన్నారపు మస్తాన్ రావు గారు , కవి నబి కరీమ్ ఖాన్ గారు , అర్షద్ , కరీముల్లా మరియు స్థానిక ప్రజలు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
డాక్టర్ చాపల శాంత కుమారి,
డాక్టర్ చాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు