21/08/2025
(Old)
కు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి
మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి & నీటి పారుదల శాఖ నిమ్మల రామనాయుడు గారికి
పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి
పార్లమెంట్ సభ్యురాలు (రాజమహేంద్రవరం) దుగ్గిరాల పురందేశ్వరి గారికి
జిల్లా కలెక్టర్ & ఆర్.ఎం.సి. కమిషనర్ ప్రసాంతి గారికి, ఐ.ఏ.ఎస్.
రుడా చైర్మన్ బొద్దు వెంకట రమణ చౌదరి గారికి
ఎంఎల్సి సోము వీర్రాజు గారికి
నగర ఎమ్మెల్యేలు : బత్తుల బాలరామకృష్ణ గారికి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి
విషయం: భారత జనగణన కమిషనర్ నిర్ణయించిన పరిపాలనా సరిహద్దుల గడువు తేదీ 31 డిసెంబర్ 2025 లోపు గ్రేటర్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (GRMC) ఏర్పాటు చేయవలసిందిగా వినతి.
మర్యాదపూర్వక నమస్కారములు,
1866లో రాజమండ్రి మున్సిపాలిటీ స్థాపించబడింది మరియు 1994లో మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది. అయితే, వేగంగా పెరుగుతున్న నగర అవసరాలకు తగ్గట్టుగా సరిహద్దుల విస్తరణ, సమగ్ర ప్రణాళిక, మౌలిక వసతుల పెంపు ఇంకా జరగలేదు.
భారత జనగణన కమిషనర్ 2025 డిసెంబర్ 31లోపు అన్ని పరిపాలనా సరిహద్దు మార్పులను పూర్తిచేయవలసిందని ఆదేశించారు. ఈ గడువు లోపు గ్రేటర్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (GRMC) ఏర్పడకపోతే, జనగణన డేటా, ప్రజా ప్రాతినిధ్యం, అభివృద్ధి పథకాల అర్హతలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ నేపథ్యంలో, నగరానికి అనుసంధానమైపోయిన క్రింది 35 పంచాయతీలును విలీనం చేసి, గ్రేటర్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మనవి.
పంచాయతీలు:
హుకుంపేట, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, పిడిమగోయి, డౌలేశ్వరం, కత్తేరు, వెంకటనగరం, కొలమూరు, రాజవోలు, తొర్రేడు, పాలచెర్ల, దివాంచెరువు, నమవరం, చక్రద్వారబంధం, వెలుగుబండ, రాజానగరం, నరేంద్రపురం, గడల, నిడిగట్ల, మధురాపూడి, బూరుగుపూడి, వేళమగిరి, నందరాడ, గుమ్ములూరు, బుచ్చెంపేట, మిర్తిపాడు, బొబ్బిలలంక, ఫరిజల్లిపేట, కనవరం, పల్లకడియం, శ్రీకృష్ణపట్నం, పుణ్యక్షేత్రం, దోసకాయలపల్లి, కడియపులంక.
---> అదనపు ఆందోళన
ఆర్.ఎం.సి పరిధి ప్రజలకు కేటాయించబడిన 50,000+ హౌస్ సైట్లు ప్రస్తుతం కార్పొరేషన్ సరిహద్దుల బయట ఉన్నాయి.
ఈ ప్రాంతాలు విలీనం కాకపోతే:
1) జనాభా గణన తగ్గి చూపబడుతుంది
2) ప్రభుత్వ నిధుల కేటాయింపులు తగ్గుతాయి
3) భవిష్యత్ పథకాల అర్హత కోల్పోతుంది
---> గ్రేటర్ రాజమహేంద్రవరం (GRMC) ఏర్పడితే లాభాలు
1) పట్టణ ప్రణాళికాభివృద్ధి – ఏకీకృత పరిపాలనతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి.
2) ట్రాఫిక్ సౌలభ్యం – రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదలతో రాకపోకలు సులభం.
3) అండర్గ్రౌండ్ డ్రైనేజీ – వర్షాకాలంలో నీటిమునిగిపోవడం నివారణ.
4) ఉన్నత మున్సిపల్ సేవలు – పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీరు, చెత్త నిర్వహణ, కాలువల వసతులు.
5) పర్యావరణ పరిరక్షణ – చెరువులు, కాలువలు, నీటి వనరులు, పచ్చదన పరిరక్షణ.
6) గ్రేటర్ రాజమహేంద్రవరం గుర్తింపు – రాష్ట్రంలో ప్రముఖ నగరంగా ఎదగడం.
---> GRMC ఏర్పడకపోతే పరిణామాలు
1) ట్రాఫిక్ కిక్కిరిసిపోవడం – వాహనాల పెరుగుదలతో తీవ్రమైన రద్దీ.
2) ముంపు సమస్యలు – సరైన డ్రైనేజీ లేకపోవడం వల్ల వరదల సమస్య.
3) అభివృద్ధి మందగించడం – పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు వెనుకబడిపోవడం.
4) పెట్టుబడులు తగ్గిపోవడం – పరిశ్రమలు, కంపెనీలు దూరంగా ఉండటం.
5) నగర ప్రతిష్ట తగ్గిపోవడం – ఇతర నగరాలతో పోలిస్తే వెనుకబాటు.
6) ప్రజా అసంతృప్తి – అభివృద్ధి లేక స్థానికులు నిరాశ చెందడం.
7) అనియంత్రిత నగరీకరణ – ప్రణాళిక లేకుండా విస్తరించి బస్తీలు (slums) గా మారే ప్రమాదం.
---> అందువలన, గౌరవప్రదమైన మీ దృష్టిని ఈ అంశంపై ఆకర్షిస్తూ, 2025 డిసెంబర్ 31 గడువు లోపు గ్రేటర్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేపట్టవలసిందిగా మేము వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము.